రాజకీయ ఒంటరితనానికి పవన్‌కల్యాణ్‌ వివరణ!

పవన్‌ కల్యాణ్‌ జనసేన అనే రాజకీయ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు. అలా అనడం కంటె వ్యవస్థాపకుడు అంటేనే బాగుంటుంది. ఆయనే ఆ పార్టీని స్థాపించారనేది అందరికీ తెలుసు. కానీ అధ్యక్షుడా? కార్యదర్శా? లాంటి వివరాలు మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే.. ఆ పార్టీకి ఇప్పటిదాకా కమిటీనే లేదు. పార్టీలో ఆయన ఒక్కడే తప్ప.. మరొకరు లేరు. అభిమానులంతా ‘మేం పవన్‌ పార్టీనే’ అనుకోవడమే తప్ప.. ఆయన పార్టీలో ఇప్పటిదాకా ఎవ్వరూ లేరు. పార్టీలో ఆయన ఒక్కడే ఉన్నాడంటూ, కిట్టనివాళ్లు విమర్శిస్తూ ఉంటారు కూడా!
అయితే తాజాగా విడుదలకు సిద్ధం అవుతున్న సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రం ట్రైలర్‌లో పవన్‌ కల్యాణ్‌.. ఇలాంటి తన రాజకీయ ఒంటరితనానికి సంబంధించిన విమర్శలకు సమాధానం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ట్రైలర్‌ చూస్తే , కాస్త లోతుగా ఆలోచిస్తే ఆ సంగతి బోధపడుతుంది.
==
పవన్‌కల్యాణ్‌ సినిమాలో విలన్‌ ఇలా అడుగుతాడు.
”ఒక్కడివీ ఏం చేయగలవ్‌ రా?”
”ఒక్కడినే.. ఒక్కడినే…
ఎక్కడికైనా ఇలాగే వస్తా.. ఇలాగే ఉంటా…
జనంలో ఉంటా.. జనంలా ఉంటా…”
అంటూ పవన్‌ కల్యాణ్‌ చాల ఫెరోషియస్‌గా జవాబు ఇవ్వడం ఈ ట్రైలర్‌లో మనకు కనిపిస్తుంది.
‘ఒక్కడినే.. ఒక్కడినే.. అంటూ పవన్‌ కల్యాణ్‌ చెప్పే వివరణ.. రాజకీయం ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా ఏకాకిగా, ఒంటరిగా నడుపుతున్న తీరుపై వినిపించే విమర్శలకు సమాధానం అని అనుకోవచ్చు. తాను ఒక్కడే ఉన్నప్పటికీ కూడా.. జనంలో ఉంటూ.. జనంలాగానే ఉంటూ.. పనిచేస్తానని ఈ డైలాగుల ద్వారా పవన్‌ రాజకీయ విమర్శకులకు కూడా వివరణ ఇచ్చినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
అయినా రాజకీయాల్తో కూడా సంబంధం ఉన్న హీరోలు తమ తమ చిత్రాల్లో.. ఆ వాసన కూడా స్ఫురించేలా డైలాగులు వేయడం.. తద్వారా తమ అభిమానులకు కిక్‌ ఇవ్వడానికి ప్రయత్నించడం మన తెలుగుతెరమీద కొత్త సంగతి కాదు. కాకపోతే.. ఈ డైలాగు కేవలం కిక్‌ ఇవ్వడానికేనా.. జనసేన అధినేతగా తన రాజకీయ ఒంటరితనానికి కల్యాణ్‌ సీరియస్‌ వివరణ కూడానా? అనేది వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close