మే నెల తరువాతే ఏపి, తెలంగాణా భాజపా అధ్యక్షుల నియామకం?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల భాజపా అధ్యక్షుల పదవీకాలం ముగుస్తున్నందున త్వరలోనే వారి స్థానంలో కొత్తవారిని అధ్యక్షులుగా నియమిస్తారని అందరూ ఊహించారు. కానీ ఏప్రిల్ 4నుంచి మే16 వరకు అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున, అవి పూర్తయిన తరువాతే రెండు తెలుగు రాష్ట్రాలకి అధ్యక్షులను నియమించవచ్చని భాజపా నుంచి అనధికార సమాచారం అందింది. తెలంగాణా భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవీ కాలం ఫిబ్రవరిలోనే ముగిసిపోయింది. ఆంద్ర ప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు పదవీ కాలం కూడా త్వరలోనే ముగియబోతోంది. కానీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్తవారిని నియమించే అవకాశం లేకపోతే వారే తాత్కాలికంగా అధ్యక్షులుగా కొనసాగవలసి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపా అధ్యక్ష పదవికి సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ హరిబాబుతో సహా కన్నా లక్ష్మినారాయణ వంటి మరి కొందరు నేతలు కూడా ఆ పదవి కోసం ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో బీసీలకు చెందిన ఎమ్మెల్యే డా. కె. లక్ష్మణ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు భాజపా అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్. రామచంద్ర రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తరువాత ఫలితాలను బట్టి ఆ పుదుచ్చేరితో సహా ఆ నాలుగు రాష్ట్రాలలో కూడా భాజపా పాలకవర్గాలని పునర్వ్యవస్తీకరించాలని భాజపా అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close