పాపం తెలుగుహీరో : ‘పరారీలో పాడు పిల్లాడు’

చేతిలో సినిమాలు లేకపోయినా.. పుష్కలంగా వివాదాల్ని చుట్టూ పెట్టుకుని చెలరేగిపోవడం కొందరు తెలుగు సినిమా హీరోలకు అలవాటుగా మారిపోతూ ఉన్నట్లుంది. ఫ్రెండ్స్‌బుక్‌ అనే ఒక ఊరూ పేరూ లేని సినిమా చేసి.. తనకు తాను హీరోగా బ్రాండ్‌ వేసేసుకున్న ఓ కుర్రాడు.. సినిమాకంటె ఎక్కువగా ఆ తరువాత ఆకతాయి, పోకిరీ, నేరమయమైన విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఆ చిత్రం హీరో ఉదయకిరణ్‌ ఇప్పుడు కటకటాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అదే రీతిగా చేతిలో సినిమాలు లేకపోయినా.. మరో పాడు పనికి పూనుకున్న మరో వివాదాల చరిత్ర ఉన్న హీరో ఇప్పుడు పరారీలో ఉన్నాడు.

ఇదంతా హీరో నవదీప్‌కు చెందిన వ్యవహారం. తన కెరీర్‌లో చెప్పుకోడానికి కొన్ని మంచి చిత్రాలు కూడా ఉన్నప్పటికీ.. అంతకంటె ఎక్కువగా చిన్న చిన్న వివాదాలు, నేర సంబంధిత వార్తలతోనే పలుమార్లు వార్తల్లో వ్యక్తిగా మారడం నవదీప్‌కు కూడా అలవాటే. అతను ప్రస్తుతం ఓ రేవ్‌ పార్టీలో ఉండి, పోలీసులు దాడిచేయడంతో పరారైపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్‌లోని ఒక ఫాంహౌస్‌లో రేవ్‌ పార్టీ జరుగుతోంటే శనివారం ఉదయం తెల్లవారుజామున ఎక్సయిజ్‌ మరియు పోలీసులు ఉమ్మడిగా దాడిచేసి పలువురిని అరెస్టుచేశారు. అయితే ఈ పార్టీనుంచి హీరో నవదీప్‌ మరికొందరు ఆయన మిత్రులు మాత్రం పారిపోయినట్లు తెలుస్తున్నది. ఫాంహౌస్‌ యజమాని, రేవ్‌ పార్టీ మేనేజర్‌ సాయి, సెక్యూరిటీ గార్డుల్ని మాత్రం అరెస్టు చేశారు.

హీరో నవదీప్‌ అంటే.. తనకి కెరీర్‌లో కొన్ని మంచి చిత్రాలు కూడా ఉన్నాయి. పైగా ఒక సీజన్‌లో మెగా స్టార్‌ చిరంజీవి కుటుంబానికి చాలా సన్నిహితంగా మెలిగిన చరిత్ర కూడా నవదీప్‌కు ఉంది. నవదీప్‌ మా కుటుంబ సభ్యుడే అంటూ మెగాస్టార్‌ స్వయంగా ఒక సినిమా ఫంక్షన్‌ వేదిక మీద ప్రకటించిన సంగతి కూడా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అలాంటి నవదీప్‌ కొంతకాలంగా సినిమాల్లేక ఖాళీగా ఉండగా.. ప్రస్తుతం రేవ్‌పార్టీ వివాదంలో చిక్కుకోవడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close