ఆ రెండు పాట‌ల సంగ‌తేంటి.. ప‌వ‌న్‌?

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సెన్సార్ హ‌డావుడి హ‌డావుడిగా పూర్త‌యిపోయింది. సెన్సార్ క్లియ‌రెన్స్ రావ‌డంతో స‌ర్దార్‌… బాక్సాఫీసు బొనాంజాకు రెడీ అయ్యింది. అయితే… మిగిలిన రెండు పాట‌ల్నీ ఎప్పుడు సెన్సార్ చేస్తార‌న్న‌దే పెద్ద ప్ర‌శ్న‌. రెండు పాట‌లు మిన‌హా సెన్సార్ పూర్త‌యిపోయిన‌ట్టు.. వార్త‌లొచ్చాయి. అదీ.. నిజ‌మే. ఎందుకంటే ఈ సినిమా సెన్సార్ అవుతున్న‌ప్పుడు స‌ర్దార్ బృందం స్విస్‌లో ఆఖ‌రి పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటోంది. అలా చూసినా ఒక పాట మిన‌హా సెన్సార్ పూర్త‌యిన‌ట్టు. ఆ పాట‌ని ఈరోజు సెన్సార్ చేస్తార‌ని చెప్పుకొన్నారు.

కానీ… అలాంటిదేం జ‌ర‌గ‌లేదు. అస‌లు స‌ర్దార్‌లో మిగిలిన పాట‌ని సెన్సార్ ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం చిత్ర‌బృందానికి లేద‌ని తెలుస్తోంది. సినిమా విడుద‌ల‌య్యాక‌.. ఆ పాట‌ని సంద‌ర్భానుసారం క‌ల‌పాల‌ని స‌ర్దార్ టీమ్ భావిస్తోంద‌ట‌. అలాగైతే రిపీటెడ్ ఆడియ‌న్స్ ఉంటార‌ని.. ఆ ర‌కంగా సినిమా వ‌సూళ్లు పెరుగుతాయ‌ని స‌ర్దార్ టీమ్ ఆలోచ‌న‌. అయితే స‌ర్దార్‌లో మిగిలిన పాట‌ని కూడా శుక్ర‌వారమే గుట్టు చ‌ప్పుడు కాకుండా పూర్తి చేశార‌ని.. స‌ర్దార్ సినిమా మొత్తం సెన్సార్ అయిపోయింద‌న్న గుస‌గుస‌లూ వినిపిస్తున్నాయి. స‌ర్దార్ సెన్సార్ విష‌యంలో చిన్న‌పాటి మ‌త‌ల‌బు ఉంద‌న్న‌ది వాస్త‌వం. అదేంటో..?? ఎందుకోసం ఒక పాట‌ని ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చిందో చిత్ర‌బృందమే సెల‌వివ్వాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close