తెలంగాణాలో కటీఫ్ ఆంధ్రాలో దోస్తీ..సాధ్యమేనా?

తెలంగాణాలో తెదేపాతో పొత్తులు తెంచుకోవడానికి భాజపా సిద్దమవుతున్నట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచనప్రాయంగా నిన్న చెప్పారు. ఇంచుమించు అదే సమయంలో విశాఖపట్నం (ఉత్తర) నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు.

ఆయన నిన్న విశాఖలో మీడియాతో మాట్లాడుతూ “తెదేపా-బీజేపీల మధ్య భేదాభిప్రాయాలున్నమాట నిజమే కానీ అవి మా స్నేహాన్ని దెబ్బతీసేంత పెద్దవేమీ కావు. మా రెండు పార్టీల మధ్య మంచి అవగాహనే ఉంది కనుక వీలయినంత ఎక్కువకాలం మేము కలిసి పనిచేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసుకోవడం కోసం మేము గట్టిగా కృషి చేస్తాము. కానీ దానర్ధం తెదేపాతో తెగతెంపులు చేసుకొంటామని కాదు. దానితో మాకు శత్రుత్వం ఉందనీ కాదు. తెదేపాతో మా స్నేహం మున్ముందు ఇంకా బలపడుతుందనే మేము భావిస్తున్నాము,” అని చెప్పారు.

తెలంగాణాలో తెదేపా-బీజేపీ తెగతెంపులు చేసుకొని ఆంధ్రాలో కొనసాగడం సాధ్యమేనా అంటే, తెలంగాణాలో తెదేపా ప్రస్తుత పరిస్థితిని బట్టి సాధ్యమేనని చెప్పవచ్చును. తెలంగాణాలో తెదేపా క్రమంగా తుడిచిపెట్టుకుపోతోంది కనుక అక్కడ ఆ రెండు పార్టీలు ప్రత్యేకంగా తెగతెంపులు చేసుకోవలసిన అవసరం ఉండకపోవచ్చును. కనుక ఆంధ్రాలో అవి ఏవయినా కారణాలతో విడిపోవాలనుకొంటే తప్ప మిత్రపక్షాలుగా కొనసాగడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close