నిర్భయకు కాదు దోషులకే న్యాయం జరగాలి!!!

సుమారు 28 నెలల క్రితం డిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక హత్యాచార ఘటన చరిత్రలో కలిసిపోయి చాలా రోజులే అయ్యింది. ఒకప్పుడు దానిపై పుంఖాను పుంఖాలుగా కధనాలు ప్రచురించిన మీడియాకి దాని గురించి ఆలోచించే ఆసక్తి, తీరిక రెండూ లేవు. ఆ సంఘటన జరిగినప్పుడు చాలా వీరావేశంతో ఊగిపోయిన ప్రజలు దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. వారిని చూసి హడావుడి చేసిన ప్రభుత్వం కూడా ఆ కేసుని కోర్టులకి అప్పగించేసి చేతులు కడిగేసుకొంది. కనుక అప్పుడప్పుడు దాని గురించి ఇలాగ వార్తలు వినడమే తప్ప, ఆ దారుణానికి పాల్పడిన దోషులకు శిక్షపడినట్లు లేదా వేయబోతున్నట్లు ఎన్నడూ వార్తలు చూడలేదు. అదే మన దేశంలో వ్యవస్థల గొప్పదనం.

ఆ నేరానికి పాల్పడిన వారిలో మిగిలిన అందరి కంటే అత్యంత పాశవికంగా ప్రవర్తించిన బాలనేరస్తుడు మూడేళ్ళ నిర్బంధం తరువాత బాలనేరస్థుల గృహం నుంచి కొన్ని నెలల క్రితమే విడుదలయి బయటకి వెళ్లిపోయాడు. అతను మళ్ళీ జీవితంలో స్థిరపడేందుకు వీలుగా డిల్లీ ప్రభుత్వం అతనికి రూ. 10, 000 నగదు, కుట్టు మిషన్ వగైరా ఇచ్చినట్లు వార్తలు వచ్చేయి. సమాజం వలన అతనికి ఎటువంటి నష్టమూ, ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొంది. కనుక ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో ఏమి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. కనుక అతనికి పూర్తి న్యాయం జరిగినట్లే భావించవచ్చును.

ఇంకా వినయ్ శర్మ, అక్షయ్ టాకూర్, ముకేష్ మరియు పవన్ గుప్తా అనే మరో నలుగురు దోషులకు, ఆ కేసును విచారిస్తున్న ఫాస్ట్-ట్రాక్ కోర్టు సెప్టెంబర్ 2013 లో ఉరి శిక్షలు వేసినా, వాటిని డిల్లీ హైకోర్టు నిలిపివేసింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా వారి కేసుపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. సుప్రీం కోర్టు తీసుకొన్న తాజా నిర్ణయంతో అది ఇప్పుడప్పుడే ముగిసే అవకాశం కూడా లేదని స్పష్టం అవుతోంది.

“వందమంది దోషులు శిక్ష పడకుండా తప్పించుకొనిపోయినా పరువాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా పొరపాటున శిక్షపడకూడదనే,’ ఫార్ములాని చాలా నిబద్దతో పాటిస్తున్న సుప్రీం కోర్టు, ఈ కేసులో దోషులుగా నిర్ధారించబడిన ‘ఆ నలుగురు’ తరపున బలంగా వాదించేందుకు మంచి సమర్దులయిన న్యాయవాదులు లేకపోవడం వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందని భావించి, వారికోసం రాజు రామచంద్రన్ మరియు సంజయ్ హెగ్డే అనే ఇద్దరు సీనియర్ న్యాయవాదులను నియమిస్తున్నట్లు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ వి.గోపాల గౌడ, మరియు జస్టిస్ కురియన్ జోసఫ్ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసులో దోషులుగా గుర్తించిన ఆ నలుగురికి న్యాయం జరిగేందుకు తాము తీసుకొన్న నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పింది. ఈ కేసు విచారణను జూలై 18కి వాయిదా వేసింది. అంటే సుమారు మరో నాలుగు నెలలు ఆ నలుగురు నిశ్చింతగా ఉండవచ్చన్నమాట. ఆ తరువాత కూడా వారి తరపున ఇద్దరు సీనియర్ న్యాయవాదులు వాదించబోతున్నారు కనుక ఈ కేసు మారో నాలుగయిదేళ్ళు సాగినా ఆశ్చర్యం లేదు.

ఈ కేసులో అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేయబడి, అంతకంటే భయానకంగా హత్యచేయబడిన ‘నిర్భయ’కు మన చట్టాలు, న్యాయస్థానాలు న్యాయం చేయలేకపోయి ఉండవచ్చును. కానీ ఆమెపై ఆ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురికి న్యాయం చేయకుండా ఉండలేమని స్పష్టం చేస్తున్నాయి. గ్రేట్!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close