వైకాపా విమర్శలకి తెదేపా మౌనమే సమాధానం!

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని కోరుతూ వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో మూడవ రోజుకి చేరుకొంది. ఉత్తరాంధ్రా జిల్లాల వైకాపా నేతలు, అంబటి రాంబాబు, సుబ్బారెడ్డి వంటి సీనియర్ నేతలందరూ వచ్చి ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు.

అమర్నాథ్ కి సంఘీభావం తెలపడానికి వచ్చిన అంబటి రాంబాబు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటుగా విమర్శలు చేసారు. “రైల్వే జోనే సాధించలేని ముఖ్యమంత్రి ఇంక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమి సాధించగలరని ఎద్దేవా చేసారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చనందుకు హోదా ఇవ్వలేకపోతున్నామని చెపుతున్న కేంద్రప్రభుత్వం, రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో, ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెట్టిన్నప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలదీసి ఎందుకు అడగడం లేదు అని ప్రశ్నించారు. రైల్వే జోన్ గురించి తెదేపా కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదని విమర్శించారు. తెదేపా-భాజపాలు రెండూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నాయని అంబటి రాంబాబు విమర్శించారు.

వైకాపా ఎంపి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ “తెదేపా ప్రభుత్వం, దాని ఎంపిలు మాట్లాడకపోయినా తాము ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర మంత్రులను కలిసి అడిగినా వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. అయినప్పటికీ రైల్వే జోన్ ఏర్పాటు చేసేవరకు తాము పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పారు.

సాధారణంగా వైకాపా నేతలు చేసే ప్రతీ విమర్శకి వెంటనే స్పందించే తెదేపా నేతలు, మంత్రులు ఈ దీక్ష గురించి కానీ, ఆ సందర్భంగా వైకాపా నేతలు తమపై చేస్తున్న విమర్శలపై గానీ ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. ఇది కూడా ప్రజల మనోభావాలతో ముదిపడున్న సున్నితమయిన అంశమే కనుక ఈ విషయంలో తెదేపా నేతలు సంయమనం పాటిస్తున్నట్లున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొన్నప్పుడు కూడా తెదేపా ఇదేవిధంగా వ్యహరించింది. కనుక అమర్నాథ్ దీక్షకి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ముగింపే ఇవ్వవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close