కరువు ప్రాంతాల్లో సరదా యాత్రా?

బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప తన ఖరీదైన లైఫ్ స్టయల్ ను బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా అక్రమాలకు పాల్పడారని అవినీతి కేసులున్నాయి. వాటిమీద విచారణ జరుగుతోంది. ఈ కారణంగానే బీజేపీ నుంచి బయటకు వెళ్లి, మళ్లీ లోనికి వచ్చిన యడ్యూరప్పను బీజేపీ మంచి పదవితోనే గౌరవించింది. ఇప్పుడు కోటి రూపాయల ఖరీదైన కారులో కరువు పీడిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు.

టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రడో కారును ఇటీవల ఓ వ్యాపారి బహుమతిగా ఇచ్చారట. కోటి రూపాయల కారును నజరానాగా ఇచ్చారంటే మతలబు లేకుండా ఉంటుందా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో బలమైన లీడర్ కాబట్టి, ఎందుకైనా మంచిదని గిఫ్ట్ ఇచ్చారో లేక నిజంగానే ఆయనంటే అభిమానంతో ఇచ్చారో వేరే విషయం. కానీ కరువుతో విలవిల్లాడుతున్న రైతులను పరామర్శించడానికి ఇంత ఖరీదైన కారులో పోవాలా అనేది ప్రశ్న. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు యడ్యూరప్పపై యుద్ధ భేరీ మోగించారు. అవినీతిపరుడైన ఆయన కనీసం ఆలోచన లేకుండా రైతులను కించపరిచేలా లగ్జరీ కారులో పరామర్శకు వెళ్లడం దారుణమని విమర్శిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కరువు తాండవిస్తోంది. కర్ణాటకలోనూ తీవ్రంగా ఉంది. సమయం సందర్భాన్ని బట్టి మనిషి ప్రవర్తన ఉండాలి. పెళ్లికి వెళ్లేటప్పుడు ఖరీదైన డ్రెస్ వేసుకుంటారు. ఏదైనా విషాదకరమైన సందర్భం అయితే తెల్లడి డ్రెస్ లేదా ఆడంబరంగా కనిపించని సాదా సీదా డ్రెస్ వేసుకుని వెళ్తారు. వర్సాలు లేక, పంటలు లేక, నష్టాల పాలై అష్టకష్టాలు పడుతున్న రైతుల ముందు తన డాబును దర్పాన్ని ప్రదర్శిచడం వల్ల ఒరిగేది ఏమిటి? వచ్చిన నాయకుడు తమకు మేలు చేస్తాడనే నమ్మకం కలగాలంటే ఆ విధంగా ప్రవర్తించారు. ఈయన డాబూ దర్పం చూసిన రైతులు, ఇది కేవలం ఫొటోల కోసం పోజులివ్వడమే అని అనుకునే అవకాశాలే ఎక్కువ. విమర్శలు మరీ ఎక్కువ కావడంతో యడ్యూరప్ప పునరాలోచనలో పడ్డట్టున్నారు.

మొదట, గ్రామాలకు వెళ్లేటప్పుడు కాస్త కమ్ ఫర్ట్ అవసరమని వాదించారు. ఇప్పుడు లగ్జరీ కారును పక్కనబెట్టాలని, వీలైతే రైల్లో వెళ్లాలని భావిస్తున్నారట. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖరీదైన వాచీ దుమారం రేపింది. ఎవరో ఇచ్చిన బహుమతి అని చెప్పినా యడ్యూరప్ప సహా బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా సరైన ఆలోచన లేని విధంగా వ్యవహరించడానికి ప్రయత్నించడం బట్టి చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. రాజకీయ నాయకులకు ప్రజల కష్టాల పట్ల కనీస సానుభూతి ఉండదు. వాళ్ల సానుభూతి మాటలు మనసులోంచి రావనే విమర్శలు నిజమేనని రుజువు చేయడానికి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close