ఆయన పోయేవరకు పొగ పెట్టారు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వారికి కొత్త చిక్కులు కూడా వచ్చి పడుతున్నాయి. ఇవేమి వారు ఊహించని కష్టాలు కాదు. ఒకరకంగా చెప్పాలంటే.. టీ కాంగ్రెస్ లో మిగిలి ఉన్న నాయకులూ ఎవరూ మిస్ కాకుండా.. అందరికీ పదవులు పంచేస్తూ పార్టీ కార్యవర్గం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిమీద కూడా అసంతృప్తులు రేగుతున్నాయి. ఇన్నాళ్ళుగా పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన వకులాభారణం రామకృష్ణ ఇప్పుడు రాజీనామా చేసారు. అయన తెలంగాణ కు సంబంధించినంత వరకు ప్రముఖ బీసీ నాయకుడు కూడా కావడం వల్ల ఈ రాజీనామా తో ఎంతో కొంత నష్టం ఉంటుందని భావించవచ్చు.
ఒకరకంగా చెప్పాలంటే వకులాభారణం రామకృష్ణ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లేలా పార్టీ వాళ్ళే పొగ పెట్టారని చెప్పాల్సి ఉంటుంది. బీసీ వర్గానికి అనుకూల నిర్ణయం తీసుకున్నందుకు అయన కెసిఆర్ ను అభినందించిన సంగతి తెలిసిందే. ఆ మాత్రం దానికి టీపీసీసీ నాయకులకు ఆగ్రహం ఉప్పొంగి, ఆయనకు షో కాజ్ నోటీసులు ఇచ్చారు. అయన వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంత జంబో కార్యవర్గం ప్రకటించి ఆయనకు చోటు లేకుండా చేసారు. ఈ పరిణామాలపై కలత చెందినా వకులాభరణం.. పార్టీని మొత్తం అసమర్థులతో నింపేసారని, అందువల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం విశేషం.
టీపీసీసీ నాయకులు తమ వ్యక్తిగత రగద్వేషాలకు అనుకూలంగా అధిష్టానం కు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చి, కిట్టని నాయకుల్ని బయటకు పంపేలా కుట్రలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తమ పతనాన్ని తామే నిర్దేశించుకునే ఇలాంటి చర్యలు గనుక కాంగ్రెస్ లోకల్ నాయకులూ మనుకోకుంటే… ముందు ముందు మరింత ఇబ్బంది అని పలువురు సూచిస్తున్నారు. వకులాభరణం విషయానికి వచ్చినా.. ఆయన పార్టీ నుంచి వెళ్ళేవరకు వీరు పొగ పెట్టారని, కానీ, దీనివల్ల అయన కోల్పోయేది ఏమి ఉండదని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close