ఆ విషయంలో ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు

కొన్నిరోజుల కిందల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతిని ఒకసారి గుర్తు చేసుకోండి. జన్మభూమి కమిటీల మీద ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలు అన్నింటినీ రద్దు చేసేస్తున్నట్లు ప్రకటించారు. జన్మభూమి కమిటీ రూపేణా పార్టీ నాయకులు ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేలా క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరిస్తున్నారో, తాను గుర్తించినట్లుగా, దాన్ని నియంత్రించడానికి తానెంత నిశ్చయంగా ఉన్నాడో నిరూపించేటట్లుగా ఆయన మాట్లాడారు. కానీ తాజాగా కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం గమనిస్తే జన్మభూమి కమిటీలను నియంత్రించే విషయంలో ఆయన నిస్సహాయంగా మిగిలిపోయారని జాలి కలుగుతుంది. పార్టీ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గారని అర్థమైపోతున్నది.

జన్మభూమి కమిటీల పేరిట జరుగుతున్న దందాలు.. ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చతెచ్చేలా ఉంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ కమిటీలను మొత్తం రద్దు చేసేస్తాం అని ప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ ఇమేజి కూడాపెంచేలాగా ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్లు కూడా చెప్పారు. ఆయన మాటలు విని జన్మభూమి కమిటీల పని అయిపోయినట్లే అని అంతా అనుకున్నారు. జిల్లాల్లో సమాంతర అధికార వ్యవస్థ లాగా చెలరేగిపోతున్న ఈ కమిటీల్లో ఆందోళన మొదలైంది.

వీటి రద్దు విషయం కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం మంత్రులు చాలా మంది సమర్థిస్తూ మాట్లాడినట్లు తెలుస్తున్నది. పార్టీ శ్రేణుల్లో అసంత్రుప్తి వస్తుందని అన్నట్లుగా తెలుస్తున్నది. వీరి మాటల ఒత్తిడి చంద్రబాబు తలొగ్గారని, అందుకే జన్మభూమి కమిటీల రద్దును రెండు నెలల పాటు వాయిదా వేశారని సమాచారం. పార్టీ నాయకుల వైపు నుంచి కూడా ఈ కమిటీల కొనసాగింపునకే వినతులు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close