విజయ్ మాల్యాపై దేశ బహిష్కరణ?

బ్యాంకులని మోసం చేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాపై దేశ బహిష్కరణ వేటు వేయడానికి కసరత్తు జరుగుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. సుప్రీం కోర్టు, ఈడి కోరినా భారత్ తిరిగిరావడానికి నిరాకరిస్తున్న విజయ్ మాల్యాని వెనక్కి రప్పించేందుకు ఇదే సరయిన మార్గమని భావిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆయన పాస్ పోర్ట్ తాత్కాలికంగా రద్దు చేయబడింది. ఇప్పుడు దేశ బహిష్కరణ వేటు కూడా వేసినట్లయితే ఆయనను అరెస్ట్ చేసి భారత్ పంపవలసిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరడానికి అవకాశం కలుగుతుంది కనుక ఈ ‘ఆప్షన్’ న్ని వినియోగించుకోవడానికి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఒక విషయం మాత్రం స్పష్టం అవుతోందిపుడు. కేంద్రప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి చర్యలు అది ఆయనతో కటినంగా వ్యవహరించాలనుకొంటునట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా రద్దు చేసే అవకాశం ఉందేమో కేంద్రం పరిశీలిస్తే బాగుంటుందేమో? తద్వారా అయనకున్న దౌత్యహోదా కూడా తొలగించినట్లవుతుంది కదా? పరిస్థితి అంతవరకు వచ్చేమాటయితే విజయ్ మాల్యా ఈలోగానే తన అప్పులను తీర్చి ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close