కేసీఆర్‌ కేబినెట్‌లో మార్పుచేర్పులు : కసరత్తు షురూ!

కేసీఆర్‌ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించడానికి కసరత్తు ప్రారంభించారు. కొత్త వారికి కూడా చోటు కల్పించడం అవశ్యంగా మారిన నేపథ్యంలో.. ఎవరి మీద వేటు పడబోతున్నదనే సంగతి ఇంకా క్లారిటీ రాలేదు గానీ.. ప్రస్తుతానికి శాఖల్లో మార్పు చేర్పులు చేశారు. ఈ మార్పు చేర్పులే మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ప్రాథమిక కసరత్తు గా విశ్లేషకులు భావిస్తున్నారు.
కేసీఆర్‌ చేసిన మార్పు చేర్పుల్లో జూపల్లి కృష్ణారావునుంచి పరిశ్రమల శాఖను తప్పించడం అనేది చాలా కీలకంగా అందరూ భావిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడానికి సంబంధించి ప్రపంచమంతా పర్యటిస్తూ.. తనదైన ముద్ర చూపిస్తున్న కొడుకు కేటీఆర్‌ చేతికి పరిశ్రమల శాఖను కేసీఆర్‌ అప్పగించారు. ప్రస్తుతం కేటీఆర్‌ వద్ద ఉన్న పంచాయతీ రాజ్‌ శాఖను జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. అలాగే జోగు రామన్న పదవి కొనసాగింపు గురించి చాలా పుకార్లు నడుస్తున్న నేపథ్యంలో ఆయన నుంచి బీసీ సంక్షేమ శాఖను తప్పించారు. ఆయనకు కేవలం అటవీశాఖ మాత్రమే మిగిలింది. బీసీ సంక్షేమ శాఖను తలసాని శ్రీనివాస యాదవ్‌ చేతికి అప్పగించారు. ఆయన వద్ద నుంచి వాణిజ్య పన్నుల శాఖను తప్పించారు. అది కాస్తా సీఎం కేసీఆర్‌ వద్దకు వెళ్లింది. మిషన్‌ భగీరథ శాఖ కూడా సీఎం వద్దనే ఉంది. ఈ మార్పు చేర్పులతో ఇవాళ నోటిఫికేషన్‌ వస్తుందని అంతా అనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి నిజానికి మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణనే చేపట్టాల్సి ఉంది. అయితే దానికి సంబంధించి ఇది ప్రాథమిక కసరత్తు అనే అందరూ భావిస్తున్నారు. కొత్తగా ఎందరికి చోటు కల్పిస్తారో.. అదే జరిగితే ఎవరెవరికి ఉద్వాసన తప్పదో మాత్రం.. ఇంకా క్లారిటీ రావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close