కేసీఆర్ డైరెక్షన్లో తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పోరాటాలు?

వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చును…నమ్మశక్యంగా కూడా లేకపోవచ్చును. కానీ తెలంగాణాలో ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలను చూస్తే ఇది నిజమేనని నమ్మక తప్పడం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏఏ అంశాలపై తెలంగాణా ప్రభుత్వంతో పోరాడాలనే దానిపై  ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా వారికి అజెండా ఇస్తుంటే వారు దానినే గుడ్డిగా ఫాలో అయిపోతున్నట్లుంది.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాల ముందు కొమ్ములు తిరిగిన కాంగ్రెస్,తెదేపా, బీజేపీ నేతలు కూడా పనికిరారనిపిస్తుంది. వారందరూ కూడా సాలెగూడు వంటి ఆయన వ్యూహాలలో చిక్కుకొన్నప్పటికీ ఆ సంగతి గ్రహించలేక తామే ఆయనిని ధీటుగా ఎదుర్కొంటున్నామనే భ్రమలో ఉన్నారు. వారిని ఆ భ్రమలో ఉంచి కేసీఆర్ తన పని తాను చేసుకుపోతున్నారు. నిజానికి వారిని ఆ భ్రమలో ఉంచేందుకే కేసీఆర్ వారి కోసం నిత్యం ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం ప్రకటిస్తున్నట్లుంది.

ఇదివరకు ఎర్రగడ్డ ఆసుపత్రి పక్కన చారిత్రిక కట్టడాన్ని కూల్చివేస్తానని చెప్పడం, ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ భూములలో పేదలకు ఇళ్ళు నిర్మిస్తానని చెప్పడం, కొన్నాళ్ళు ఓటుకి నోటు కేసు, మళ్ళీ ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రిని కూల్చి వేస్తానని చెప్పడం వంటివన్నీ కూడా ప్రతిపక్షాల దృష్టి మళ్ళించి వారిని బిజీగా ఉంచేందుకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా మిషన్ కాకతీయ, రైతుల ఆత్మహత్యలు, పంటరుణాల మాఫీ, జి.హెచ్.ఎం.సి ఎన్నికలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటాయి. దాని వలన రాష్ట్రప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది.

ప్రభుత్వం తన పనులను సజావుగా నడిపించుకోవాలంటే ముందు ప్రతిపక్షాలను వేరే ఏదో అంశం మీదకు దృష్టి మళ్ళించేలా చేయడమే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే అయన ఒకదాని తరువాత మరొక వివాదాస్పద నిర్ణయాలు ప్రకటిస్తూ ప్రతిపక్షాలకు పని కల్పిస్తున్నారు. ఒక అంశంపై వాళ్ళ రాద్ధాంతం పూర్తికాగానే దానిని ఆయన పక్కన పెట్టి మరొకటి వాళ్ళకి అందిస్తూ వాళ్ళని వేరే ఇతర అంశాలపై దృష్టి పెట్టకుండా జాగ్రత్తపడుతున్నట్లున్నారు. అంటే ప్రతిపక్షాలు ఏ అంశంపై పోరాడాలనే ఎజెండాని కూడా ముఖ్యమంత్రి కేసీఆరే నిర్దేశిస్తున్నట్లు అర్ధమవుతోంది. కానీ ప్రతిపక్షాలు ఆయన పన్నిన ఈ ఉచ్చులో చిక్కుకొన్న సంగతి గ్రహించకుండా వరుసగా అయన అందిస్తున్న వివాదాలని పట్టుకొని పోరాడుతూ తామే ఆయనని నిలువరిస్తున్నామనే వెర్రి భ్రమలో మునిగిఉన్నాయి. బహుశః ఇప్పుడు కూడా ఉస్మానియా ఆసుపత్రిపై ప్రతిపక్షాలలో వేడి తగ్గగానే దానిని పక్కనబెట్టి మరొక వివాదస్పద నిర్ణయాన్ని ప్రకటిస్తారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close