నాటి ఎన్‌టీఆర్ తర్వాత ఇప్పుడు పవన్‌కే ఆ ఘనత – శివాజి

హైదరాబాద్: అప్పుటి ఎన్‌టీఆర్ తర్వాత ఇప్పుడు పవన్‌నే కులమతాలకతీతంగా తెలుగుప్రజలు అభిమానిస్తున్నారని నటుడు శివాజీ అన్నారు. అయితే పవన్‌కికూడా ఆ విషయం తెలియదని చెప్పారు. ఇవాళ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య ఆధ్వర్యంలో ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సభలో శివాజి మాట్లాడుతూ, తాను ప్రతిచోటా పవన్ పేరును ప్రస్తావించటాన్ని కొందరు విమర్శిస్తున్నారని చెప్పారు. తానలా ప్రస్తావించటానికి కారణముందని అన్నారు. పాలిచ్చే ఆవును పట్టుకుంటే పాలు లభిస్తాయిగానీ, దున్నపోతును పట్టుకుని ఎంత వేళ్ళాడినా ఉపయోగమేముంటుందని ప్రశ్నించారు. పవన్ అత్యంత ప్రజాదరణ కల నాయకుడు కాబట్టే తాను ఆయన పేరును ప్రస్తావిస్తున్నానని చెప్పారు. పవన్ రోడ్డెక్కితే ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్వం పదవిలో ఉన్నప్పుడులా లేరని అన్నారు. తమకు ఇప్పటి చంద్రబాబు వద్దని, అప్పటి చంద్రబాబు కావాలని చెప్పారు. ఇప్పుడు ఆయనను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అవినీతిమయమైపోయిందని అన్నారు. ఎంపీలు మనస్సాక్షిగా ప్రత్యేకహోదాకోసం పనిచేయటంలేదని చెప్పారు. టీడీపీ వైసీపీ నేతలు తిట్టుకోవటానికి సమయం చాలటంలేదని విమర్శించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close