తూచ్! సాక్షి ప్రసారాలను ఆపమని చెప్పలేదు

రెండు వారాల క్రితం ముద్రగడ పద్మనాభం మళ్ళీ నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాక్షి మీడియా కాపులని రెచ్చగొట్టేవిధంగా ప్రసారాలు చేస్తునందున రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, అందుకే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో సాక్షి ప్రసారాలను ప్రభుత్వమే నిలిపివేయించిందని సాక్షాత్ రాష్ట్ర హోం మంత్రి చిన రాజప్ప మీడియాకి చెప్పారు. సాక్షిపై తాత్కాలికంగానే నిషేధం విధించామని, ముద్రగడ దీక్ష విరమించి పరిస్థితులు చక్కబడగానే సాక్షిపై నిషేధం ఎత్తివేస్తామని కూడా చెప్పారు.

సాక్షి ప్రసారాలని ప్రభుత్వం నిలిపివేయడాన్నిఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి హైకోర్టులో సవాలు చేశారు. దానిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టగా ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది, సాక్షి ప్రసారాలని నిలిపివేయమని ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ గానీ ఎం.ఎస్.ఓ.లకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. అదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో తమకి సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ ఈ కేసుని జూన్ 27కి వాయిదా వేశారు.

సాక్షి ప్రసారాలని నిలిపివేయాలనే అత్యుత్సాహంలో ఈ తరువాత పరిణామాల గురించి ప్రభుత్వం ఆలోచించడం మరిచిపోయినట్లుంది. అదే ఊపులో హోం మంత్రి చిన రాజప్ప తామే సాక్షి ప్రసారాలని నిలిపి వేయించమని ప్రకటించారు. ఆ రోజు ఆయన మీడియాకి చెప్పిన ఆ మాటల క్లిపింగ్స్ ని సాక్షి తరపు న్యాయవాది కోర్టుకి సమర్పించారు. కానీ ఇపుడు ప్రభుత్వం సాక్షి మీడియాని నిషేధించమని ప్రభుత్వం ఎవరినీ ఆదేశించలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడం పొరపాటేనని భావించవచ్చు. అదే విషయాన్నీ అఫిడవిట్ రూపంలో సమర్పించడం అంటే, ఆ మాటకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం అంగీకరించడమే అవుతుంది. అప్పుడు హోం మంత్రి చిన రాజప్ప వ్యాఖ్యల గురించి కోర్టు ప్రశ్నించడం ఖాయం. అదే జరిగితే కోర్టుకి సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. దాని వలన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు.

ఒకవేళ ప్రభుత్వం, పోలీసులు కోరకపోతే సాక్షి ప్రసారాలు ఎందుకు నిలిచిపోయాయి? ఎవరు నిలిపివేశారు? అని న్యాయస్థానం ప్రశ్నిస్తే దానికి సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోవడం కష్టమే. ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఏమి ఉపాయం ఆలోచిస్తోందో? బహుశః ఆర్ధిక చెల్లింపుల వ్యవహారంలో సాక్షి తీరు సంతృప్తిగా లేనందునో, లేదా బకాయిలు చెల్లించనందుకో ప్రసారాలు నిలిపివేశామని ఎంఎస్.ఓ.ల ద్వారా చెప్పిస్తుందేమో? అయితే దానికి వారు సరైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఏవిధంగా చూసినా సాక్షి విషయంలో ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పవనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close