ముఖ్యమంత్రి ఎవరికీ మేలు చేయాలి? రైతులకా..సింగపూర్ సంస్థలకా? రోజా ప్రశ్న

వైకాపా ఎమ్మెల్యే రోజా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. రాష్ట్రానికి, రైతులకి తీవ్ర నష్టం కలిగించబోయే స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణానికి తమ పార్టీ అంగీకరించదని, దానిని అడ్డుకొనేందుకు తన సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతుందని చెప్పారు. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వాల మార్పు వలన కానీ మరే ఇతరత్రా కారణాల చేత గానీ మద్యలో ఒప్పందం రద్దు చేసుకొన్నట్లయితే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం సింగపూర్ నిర్మాణ సంస్థలకి చాలా బారీగా నష్టపరిహారం, భారీగా వడ్డీ కూడా చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవడం అంటే భవిష్యత్ తరాలని కూడా అప్పుల ఊబిలో త్రోసినట్లే అవుతుందని ఆమె ఆరోపించారు.

రైతులకి మేలు చేయవలసిన ముఖ్యమంత్రి సింగపూర్ సంస్థల ప్రతినిధిలాగ ఎందుకు వ్యవహరిస్తున్నారు? వారికే ఎందుకు ఎక్కువ లబ్ది కలిగేలాగ ఒప్పందాలు ఎందుకు చేసుకొంటున్నారు? అని రోజా ప్రశ్నించారు. ఆయన ఏపికి ముఖ్యమంత్రా లేకపోతే సింగపూర్ కి ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. ఆయన సింగపూర్ సంస్థలతో కుమ్మకైనందునే వాటికి మేలు కలిగే విధంగా ఒప్పందాలు చేసుకొని రాష్ట్రాన్ని వాటికి దోచిపెట్టేయాలని ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం రాజధాని నిర్మిస్తున్నట్లు లేరని, సింగపూర్ సంస్థలకి తద్వారా తన కుటుంబానికే లబ్ది కలిగించడానికే రాజధాని నిర్మిస్తున్నట్లుందని ఆక్షేపించారు.

ముఖ్యమంత్రి ఇంత బరి తెగించి దోపిడీకి సిద్దం అవుతుంటే, తెదేపాకి మిత్రపక్షంగా ఉన్న భాజపా నేతలు ఏమి చేస్తున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా భాజపా నేతలు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడుని అడ్డుకోవాలని లేకుంటే భవిష్యత్ తరాలు ఎవరినీ క్షమించవని అన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడుతుందని, అవసరమైతే డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కూడా దీనిని అడ్డుకొని రాష్ట్రాన్ని కాపాడమని కోరుతామని అన్నారు. మోడీ ‘మేడ్ ఇన్-ఇండియా’ అంటుంటే చంద్రబాబు నాయుడు ‘టేక్ ఇన్-ఇండియా’ అంటున్నారని రోజా ఆక్షేపించారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రజలని మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని రాష్ట్ర ప్రజలు ఏవిధంగా శిక్షించారో, ఇప్పుడు ఈ స్విస్ ఛాలెంజ్ పద్దతిలో రాజధాని నిర్మాణానికి అనుమతించి రాష్ట్రాన్ని దోచుకోవడానికి అనుమతిస్తే, ప్రధాని నరేంద్ర మోడీని, భాజపాని కూడా ఏపి ప్రజలు క్షమించబోరని రోజా హెచ్చరించారు.

ఒకప్పుడు వ్యాపారానికని వచ్చిన బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పట్టి పీడించుకొని తింటుంటే వారిని అతికష్టం మీద తరిమి కొట్టామని, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడే స్వయంగా అంతకంటే కర్కోటకులని పేరు పొందిన సింగపూర్ సంస్థలని తీసుకువచ్చి రాష్ట్రాన్ని వారికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా అన్నారు. దేశానికి, రాష్ట్రానికి కూడా నష్టం కలిగించే ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని, సింగపూర్ సంస్థలని అడ్డుకోవడానికి తమ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుందని, భాజపాతో సహా అన్ని పార్టీలు, ప్రజలు కూడా తమతో కలిసి రావాలని రోజా పిలుపునిచ్చారు.

రోజా చేసిన ఈ విమర్శలు, ఆరోపణలను తెదేపా నేతలు చాలా గట్టిగా త్రిప్పికొట్టవచ్చు కానీ ఆమె వ్యక్తం చేసిన అనేక సందేహాలకి కూడా వారు సమాధానం చెపితే ఎవరి వాదన సరైనదో ప్రజలకి తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close