వైకాపాతో గొంతు కలిపి తెదేపాని విమర్శించిన భాజపా ఎంపి

రాజధాని ప్రాంతంలో అబివృద్ధి పేరిట దేవాలయాలు, చర్చిలు ప్రభుత్వం కూల్చివేయడాన్ని వైకాపా నేత పార్ధ సారధి తీవ్రంగా ఖండించారు. తెదేపా మిత్రపక్షమైన భాజపా కూడా దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. నరసాపురం భాజపా ఎంపి గోకరాజు గంగరాజు స్పందించారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ముస్లిం రాజులు దేవాలయాలను కూల్చివేసినట్లుగా తెదేపా ప్రభుత్వం కూడా దేవాలయాలను కూల్చివేస్తోందని విమర్శించారు. రోడ్లు విస్తరణ, అభివృద్ధి పేరిట విజయవాడ పరిసర ప్రాంతాలలో అధికారులు ఇష్టం వచ్చినట్లు హిందూ దేవాలయాలు కూల్చివేస్తుంటే తెదేపా ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. అధికారుల చేస్తున్న పని వలన ప్రజల మనోభావాలు దెబ్బ తింటున్నాయని, ఇకనైనా అటువంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు.

ఇప్పటికే కాంగ్రెస్, వైకాపాలు ప్రభుత్వ వైఖరిని గట్టిగా ఖండిస్తున్నాయి. ఇప్పుడు వాటితో భాజపా గొంతు కలిపింది. బహుశః నేడో రేపో మరికొందరు రాష్ట్ర భాజపా నేతలు కూడా ఆయనతో గొంతు కలుపవచ్చు. అప్పుడు ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. కనుక అటువంటి పరిస్థితి రాక మునుపే అప్రమత్తం అవడం మంచిది. ప్రభుత్వం ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్లి ఉండి ఉంటే ఇటువంటి సమస్య వచ్చి ఉండేది కాదు. కానీ అటువంటి ఆలోచన చేయకుండా వాటిపై ఎదురుదాడికి దిగడం వలన సమస్య ఇంకా జటిలం అవుతుంది.

తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సరిగ్గా అదే పని చేశారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన గోకరాజు గంగరాజుపై ఎదురుదాడి చేశారు. “మిత్రపక్షానికి చెందిన గంగరాజు మా ప్రభుత్వంపై అటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. అధికారులు కేవలం ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నారు తప్ప ఆలయాలని కాదని ఆయన తెలుసుకొంటే మంచిది. అయినా మా ప్రభుత్వం హిందూ దేవాలయాలని ఎందుకు తొలగిస్తుంది? మేమేమీ వారికి వ్యతిరేఖం కాదే? ఆయన తన ఆరోపణలను ఉపసంహరించుకొంటే బాగుంటుంది,” అని అన్నారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ఇటువంటి సవాళ్లు, ప్రతిసవాళ్ళు విసురుకోవడం వలన సమస్య పక్కదారి పట్టి దానిపై కూడా రాజకీయాలు మొదలవుతాయి. తెదేపా, భాజపా మిత్రపక్షాలుగానే ఉన్నాయి కనుక మీడియా ముందుకు వచ్చి ఈవిధంగా ఒకరినొకరు విమర్శించుకోవడం కంటే ఇరు పార్టీల నేతలు క్షేత్ర పర్యటనకి వెళ్లి పరిస్థితిని సమీక్షించి, తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు కదా? అనవసరమైన ఈ వివాదాల వలన వారే నష్టపోతారని గ్రహిస్తే మంచిది. రాజకీయనాయకులు వీలైతే ఇటువంటి సమస్యలని సామరస్యంగా పరిష్కరించాలి లేదా వాటికి దూరంగా ఉండాలి తప్ప ఇంకా జటిలం చేయడం తగదు. ఎందుకంటే రాష్ట్రం మరొక కొత్త సమస్యని భరించే స్థితిలో లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close