కుప్పకూలుతున్న తెలంగాణా న్యాయవ్యవస్థ

తెలంగాణా న్యాయవ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం నానాటికీ తీవ్రం అవుతోంది. న్యాయవ్యవస్థలో ఉన్నవారే న్యాయం కోరుతూ హైకోర్టుతో యుద్ధం చేస్తున్నారు. హైకోర్టు విభజన, ఉద్యోగుల ప్రాధమిక కేటాయింపుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ మొదలైన యుద్ధం ఇప్పుడు హైకోర్టు వైఖరిని నిరసించడానికి జరుగుతోంది. అనేక సంక్లిష్టమైన సమస్యలని పరిష్కరించిన హైకోర్టు వారిని దారిలో పెట్టలేక సతమతమవుతోంది.

చట్టాన్ని అమలుచేయవలసిన బాధ్యత హైకోర్టు భుజస్కంధాలపైనే ఉన్న కారణంగా అది క్రమశిక్షణ ఉల్లంఘించి సమ్మె చేస్తున్న ఉద్యోగులు, న్యాయాధికారులపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకొంటోంది. అదే కారణంతో మరో 11 మంది ఉద్యోగులని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ కూకట్ పల్లి, ఇబ్రహీపట్నం కోర్టులకి చెందిన 60 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. అయితే ఇంతవరకు రాజీనామాలు చేస్తున్నవారెవరూ తమ రాజీనామా లేఖలని హైకోర్టుకి సమర్పించకుండా తమ సంఘాల అధ్యక్షులకో, ప్రధాన కార్యదర్శులకో సమర్పిస్తున్నారు. ఒకవేళ వారు తమ రాజీనామా లేఖలని హైకోర్టుకి సమర్పించి ఉండి ఉంటే వాటిని అది ఆమోదించి ఉంటే వాటిని ఇక వెనక్కి తీసుకొనే అవకాశం కూడా ఉండదు. అప్పుడు పరిస్థితి మరింత భయానకంగా తయారయ్యి ఉండేది.

ప్రజలకి న్యాయం చెప్పాల్సిన న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఉద్యోగులు, హైకోర్టు వారిలో వారే ఈవిధంగా కీచులాడుకొంటూ అందరూ కలిసి న్యాయవ్యవస్థని బజారుకీడ్చారని చెప్పకతప్పదు. రిటర్డ్ న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఉద్యోగులు కూడా వచ్చి కలస్తుండటంతో అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది. రాజకీయంగా పరిష్కరించగల ఈ సమస్యని అధికారంలో ఉన్న నేతలు పట్టించుకోకపోవడం వలననే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. ప్రజలని చైతన్యవంతులు అవ్వాలని నిత్యం సుద్దులు చెప్పే ప్రభుత్వాలు, నానాటికీ పరిస్థితి విషమిస్తుంటే యుద్ద ప్రాతిపదికన దానిని చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా, అందరూ తలోరాయి విసురుతున్నారు. యధాప్రకారం ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఇంత జరుగుతున్న వారు ఇంకా మేల్కొన్నట్లు కనిపించడం లేదు.

వారి నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణాలో న్యాయవ్యవస్థ రెండుగా చీలిపోయింది. దానిలో ఉద్యోగులు, న్యాయమూర్తులందరూ ఒకవైపు, హైకోర్టు ఒకటి మరొకవైపు నిలిచి యుద్ధం కొనసాగించవలసిన దౌర్భాగ్య పరిస్థితిని చూడవలసి వస్తోంది. ఈ సమస్య ఇంకా ఎప్పటికి పరిష్కారం అవుతుందో, ఆలోగా ఇంకా ఎటువంటి అవాంచనీయమైన పరిణామాలని చూడవలసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇందుకు న్యాయవ్యవస్థలో ఉన్నవారిని నిందించడం కంటే ఈ సమస్యని పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే నిందించవలసి ఉంటుంది. కనీసం ఇప్పటికైనా పాలకులు మేల్కొని ఈ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నాలు చేసయవలసిన అవసరం చాలా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close