ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి దుట్టా రామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తానని తాను ఆమెకు మద్దతిస్తానని చెప్పుకొచ్చారు. నామినేషన్ ర్యాలీ డిజాస్టర్ అయిన తర్వాత … ఆయన మీడియాతో మాట్లాడారు. దుట్టా రామచంద్రరావు కానీ ఆయన మద్దతుదారులు కానీ వంశీకి సపోర్ట్ చేయడం లేదు. వారి మద్దతు కోసం వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కుమార్తెకు మద్దతిస్తానని చెబుతున్నారు.

వైసీపీలో వంశీ పరిస్థితి అత్యంత గడ్డుగా ఉంది. ఆయనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారు 90 శాతం వెనక్కి వెళ్లిపోయారు. ఓ పది శాతం మంది అనుచరులు ఆయనతో పాటు ఉన్నారు. వైసీపీలో ఉన్న యార్లగడ్డ తన అనుచరుల్ని తీసుకెళ్లిపోయారు. దుట్టా రామచంద్రరావు వర్గం… వంశీపై కసితో ఉన్నారు. టీడీపీలో ున్నప్పుడు కేసులు పెట్టించి.. వైసీపీ వచ్చిన తర్వాత కూడా తమ అవకాశాల్ని కాజేశారని వైసీపీ క్యాడర్ అసహనం. వాళ్లూ పని చేయడం లేదు. ఐదేళ్లలో నియోజకవర్గంలో చేసిందేమీ లేదు. నామినేషన్ ర్యాలీకి జనం కూడా రాలేదు. 2019లో టీడీపీ తరపున ఆయన నామినేషన్ వేస్తే జాతీయ రహదారి నాలుగైదు కిలోమీటర్ల మేర పసుపు మయం అయింది. కానీ వైసీపీ తరపున అడుగుపెడితే తీసుకొచ్చిన అడ్డాకూలీలు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు.

పరిస్థితి అర్థం కావడంతో చివరికి ఆయన అసహనానికి గురవుతున్నారు. దుట్టా రామచంద్రరావును ఇంత కాలం పురుగును చూసినట్లు చూశారు. ఆయన కుమార్తెను తానే జడ్పీటీసీని చేశానని చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయన కుమార్తెకు అవకాశం ఇచ్చి తాను తప్పుకుంటానని ఆఖరి రాగం పాడేశారు. కానీ వంశీ చేతులు కాలిపోయాయని.. ఇప్పుడు ఆకులు పట్టుకోలేరన్న సెటైర్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close