మరో కొత్త యుద్ధానికి సిద్దమవుతున్న తెదేపా, వైకాపాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు రెండూ యుద్ధాలు కొనసాగిస్తూనే అదే సమయంలో తమతమ రాష్ట్రాలలో ప్రతిపక్షాలతో కూడా యుద్దాలు చేయవలసివస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిపోవడంతో ఆ పార్టీ అప్రమత్తమవక తప్పలేదు. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో వైకాపాని బలపరుచుకొంటూ అదే సమయంలో అధికార తెదేపా వైఫల్యాలని ప్రజలకు వివరించాలనే ఆలోచనతో ఈనెల 8వ తేదీ నుండి ‘గడప గడపకి వైకాపా’ పేరుతో ఒక కార్యక్రమం మొదలుపెట్టబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైకాపా నేతలందరూ తమ తమ నియోజక వర్గాలలో ప్రజలని కలిసి జగన్ ఆశయాలు, ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటాల గురించి వివరిస్తారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. దాని కోసం 100 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నాపత్రాన్ని వైకాపా ఈరోజు ఆవిష్కరించింది.

ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాటాలు చేయడం, ఆ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా సహజమే. వైకాపా కూడా అదే పని చేస్తున్నప్పటికీ, ఇలాగ పనికట్టుకొని మరీ ఇంటింటికీ వెళ్లి తమ ప్రభుత్వం గురించి చెడ్డగా ప్రచారం చేయడం, తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణకి పూనుకోవడంపై తెదేపా ఆగ్రహం చెందుతోంది. కనుక తెదేపా కూడా వైకాపాకి జవాబుగా ప్రచారం చేయడానికి సిద్దం అవుతోంది. దాని కోసం నిర్దిష్టంగా ఇంకా ఎటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొనప్పటికీ, ఎన్నికల హామీలని అన్నిటినీ అమలు చేస్తుండటం గురించి గట్టిగా ప్రచారం చేసుకొంటూనే, జగన్ అవినీతి, అక్రమాస్తుల కేసులు, ఈడి అటాచ్మెంట్లు గురించి కూడా ప్రచారం చేయడం ద్వారా వైకాపాకి చెక్ పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ‘గడప గడపకి వైకాపా’ కార్యక్రమం గురించి తెదేపా నేతలు ప్రస్తావిస్తూ, జగన్ అక్రమాస్తుల కేసుల గురించి కూడా మాట్లాడటం గమనిస్తే వారి వ్యూహం అదేనని స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close