హరిత హారం భేష్..జానా! హారంలో కుంభకోణం..భట్టి!

తెలంగాణా అంతటా పచ్చదనం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరిట ఈరోజు నుంచి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తోంది. ఏ ప్రభుత్వమైనా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సాధారణమైన విషయమే. కానీ అటువంటివాటి కార్యక్రమాలని ప్రభుత్వాలు కేవలం ప్రచారార్భాటం కోసమే చేస్తుండటం వలన వాటిలో విజయవంతం అయినవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ విజయవంతమయితే అవి ఆ ప్రభుత్వాలకి, ముఖ్యమంత్రులకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు, ప్రజాభిమానాన్ని సంపాదించిపెడతాయని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పధకం, చంద్రబాబు ప్రవేశపెట్టిన రైతు బజార్లు నిరూపిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం ఈ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగితే, దాని వలన ముఖ్యమంత్రి కెసిఆర్ కి కూడా అటువంటి శాశ్వితమైన కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి.

ఈ హరితహారం కార్యక్రమంపై ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి ప్రశంసలు కురిపించారు. తెరాస ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం మొదలుపెట్టిందని, దానిలో రాష్ట్ర ప్రజలు అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. సాధారణంగా ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమానైనా ప్రతిపక్షాలు తప్పనిసరిగా విమర్శించాలనే మూర్కత్వం నుంచి జానారెడ్డి బయటపడి ఈవిధంగా స్పందించడం అభినందనీయం. దానికీ రాజకీయ కారణాలు, ఆలోచనలు ఏవైనా ఉన్నాయేమో తెలియదు కానీ ప్రభుత్వం ఒక మంచిపని చేస్తున్నపుడు దానికి అందరూ సహకరించాలని ప్రతిపక్ష నేత పిలుపునీయడం చాలా మంచి పరిణామమే.

జానారెడ్డి ఆ కార్యక్రమాన్ని మెచ్చుకొని దానికి ప్రజలందరూ సహకరించాలని పిలుపునిస్తే, తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క హరితహారం పేరుతో చాలా పెద్ద కుంభకోణం జరుగుతోందని తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడం విశేషం. నల్గొండలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఒక మొక్క నాటేందుకు సుమారు రూ.1,000 ఖర్చు అవుతున్నట్లు తెలిసింది. ఆ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మొక్కలు నాటితే ఎంత ఖర్చవుతుందో ఎవరూ ఊహించలేము. హరితహారం పేరిట తెరాస ప్రభుత్వం మరో బారీ కుంభకోణానికి బీజం వేసినట్లు అనుమానం కలుగుతోంది,” అని అన్నారు.

ఈవిధంగా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు హరితహారం కార్యక్రమంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం చూస్తే, తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో నేతల మద్య సరైన సమన్వయం, అవగాహన లేదని చాటుకొన్నట్లు అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close