కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు కానీ, ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్ వైబ్స్ కనబడుతున్నాయి. రాజధాని లేని రాష్ట్రంగా జగన్ పాలనలో వెక్కిరింతకు గురైన ఏపీ.. కూటమి అధికారం చేపట్టాక చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణానికి అడుగులు పడుతుండటం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టును శీఘ్రగతిన కంప్లీట్ చేయాలనే ఆదేశాలతో పనుల్లో వేగం పెంచారు. సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో విధ్వంస పాలనకు చిరునామాగా ఏపీని నిలిపింది వైసీపీ. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనక్కి వెళ్లింది. ఏపీ అంటేనే చిన్నచూపు చూసేలా రాష్ట్రాన్ని దిగజార్చారన్న అభిప్రాయం ప్రజల్లో బలీయంగా ఉంది. అదే ఎన్నికల్లో ప్రస్పుటమైంది. ఘోర పరాభవం తర్వాత సీరియస్ పాలిటిక్స్ చేయాల్సిన వైసీపీ సీనియర్ నేతలు కామెడీ పాలిటిక్స్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుడే జగన్ ను కోరుకుంటున్నారని కామెంట్స్ చేశారు జోగి రమేష్.
వైసీపీ అధికారం కోల్పోయి, కూటమి అధికారం చేపట్టి ఏడాది కూడా కాలేదు. అప్పుడే ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు జోగి. జగన్ కనీసం హామీల అమలు కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయడం లేదు..ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నం కూడా చేయడం లేదు. అసెంబ్లీకి వెళ్లేందుకు మొహం చాటేస్తున్నారు.
జగన్ బెంగళూరుకు పరిమితమైతే, కీలక నేతలు గతంలో చేసిన పాపాల వలన భయంతో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. మరి, ఎలా జనాలు జగన్ నాయకత్వాన్ని అప్పుడే ఎలా కోరుకుంటున్నారో జోగికే తెలియాలి. ఇప్పటికీ ఇంకా వైసీపీ నేతలు జోకుడు పాలిటిక్స్ చేస్తున్నారు అనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తుండటం గమనార్హం.