దేవుడితో రాజకీయాలు చేయడం ప్రమాదకరం. ఆ విషయం దేవుడిపై భయం, భక్తి ఉన్న వారందరికీ తెలుస్తుంది.కానీ రాజకీయం కోసం దేనికైనా దిగజారే మనస్థత్వం ఉన్న పార్టీలతోనే పెద్ద సమస్యలు వస్తున్నాయి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవరిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీని వల్ల ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని అనుకుంటున్నారు కానీ వారు దాడి చేస్తోంది శ్రీవారి భక్తుల విశ్వాసం మీద.
క్యూలైన్ లో ఓ భక్తుడు సౌకర్యాలు అందలేదని రచ్చ చేశాడు. అలా రచ్చ చేస్తానని వీడియో కూడా తీసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. వెంటనే వైసీపీ సోషల్ మీడియాకు దాన్ని పంపాడు. వాళ్లు వైరల్ చేశారు. ఒక్క భక్తుడు చేసిన ఆందోళనతో అందరి పై ముద్ర వేశారు. అతను ఎవరో కాదు..వైసీపీ నేత అని తేలింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇలా చేశాడు. తర్వాత పశ్చాత్తాపంతో దర్శనం ఆలస్యం అయిందని అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఇలా చేశానని కూడా చెప్పుకొచ్చాడు.
ఇదే మొదటి సారి కాదు. కొన్ని కొన్ని విచిత్రాలు వైసీపీ సోషల్ మీడియాస్ చిక్కుతాయి. ఓ ముస్లిం డ్రైవర్..నమాజ్ చేశాడని వాళ్లే ప్రచారం చేస్తారు. గోవులు చనిపోకపోయినా చనిపోయాయని వారే ప్రచారం చేస్తారు. ఓ దేవుడి మీద ఇంత తప్పుడు ప్రచారం చేసి.. ఎం రాజకీయ లాభం సాధిద్దామని..?. దేవుడు ఎవరి వినాశనాన్ని కోరుకోడు కానీ.. చేసిన తప్పులకు విధి బలీయంగా శిక్షిస్తుందన్నది మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో అవగతమయ్యే నిజం. దీన్ని ఎందుకు వారు గుర్తుంచుకోవడం లేదు ?