వెన్నుపోటు దినం జరుపుతామని ప్రకటించారు. అందరికీ టార్గెట్లు పెట్టారు.కానీ నాయకుడు మాత్రం కనిపించకుండా పోయాడు. బెంగళూరు పోయి అందరి పర్మార్మెన్స్లు చూసి మార్కులు ఇస్తా.. మీరు రోడ్డెక్కి డ్రామాలు వేయండి అని పార్టీ నేతలకు సందేశం ఇచ్చారు. నడిపించాల్సిన నాయకుడు.. కనిపించకుండా పోయే సరికి నేతలకు, క్యాడర్ కు మైండ్ బ్లాంక్ అయింది. ఆయన కోసం మేమంతా రోడ్డెక్కి జబర్దస్త్ షోలు చేయాలా అని బొత్స లాంటి వాళ్లు.. డ్రామాలు ఆడి సైలెంటుగా ఇంటికెళ్లిపోయారు.
క్యాడర్, లీడర్లను బలి పశువులుగా వాడుకుంటున్న జగన్
రాజకీయాల్లో క్యాడర్ రోడ్డు మీదకు రావాలంటే ముందు నాయకుడు రావాలి. కానీ కేసుల భయంతో అసలు నాయకుడే రాకపోతే కింది స్థాయి నాయకులకు ఏం అవసరం ?. మీరు లాఠీ దెబ్బలు తినండి..,కానీ రాసుకోండి..వచ్చాక మళ్లీ మనం కొడదాం అని చెప్పడం నాయకుడి లక్షణమా?. మీ మీద దెబ్బపడకుండా చూసుకుంటానని ముందుకు వచ్చి నిలబడటం నాయకుడి లక్షణమా ?. జగన్ రెడ్డి మొదటి నుంచి పార్టీ నేతల్ని. క్యాడర్ని పావులుగా వాడుకుని తాను నిచ్చెనమెట్లు ఎక్కుతున్నారు. కానీ వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు.
అందర్నీ రోడ్డెక్కించి తాను మాత్రం మార్కులేస్తారా ?
తన నేరాలు, ఘోరాలన్నింటికీ పార్టీ నేతల్ని బలి పశువుల్ని చేస్తున్నారు. పదేళ్ల పాటు కష్టపడి అధికారంలోకి వచ్చేందుకు సాయంచేసిన క్యాడర్ ను అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల పేరుతో మోసం చేశారు. తన సంపాదన కోసం పార్టీ నేతల్ని అడ్డం పెట్టుకుని అందర్నీ జైలు పాలు చేస్తున్నారు. అయినా వారి కోసం సానుభూతి , న్యాయసాయం చేయడం లేదు. వారు తప్పు చేయలేదని చెప్పడానికి కూడా నోరు రావడం లేదు. ఇప్పటికీ అదే బలి పశువుల రాజకీయం చేస్తున్నారు.
వైసీపీలో ఉండటం ఆ పార్టీ కార్యకర్తలకు శాపం
జగన్ లాంటి రాజకీయ నాయకుడు ఉన్న పార్టీలో అందరూ తమ భవిష్యత్ ను పణంగా పెట్టి జగన్ కోసం పని చేయాలి. వారి భవిష్యత్ కు మాత్రం భరోసా ఉండదు. జైళ్ల చుట్టూతిరుగుతూ ఉండాలి . లేదంటే సర్వం పోగొట్టుకోవాలి. కానీ ఆయన మాత్రం కనీసం రోడ్డెక్కరు. రోడ్డెక్కాలంటే… జన సమీకరణం చేసుకుని.. తోసేసుకునేంత సీన్ క్రియేట్ చేయాలి. డ్రామాలు ఆడి ఆయన దారి ఆయన చూసుకుంటారు. అలాంటి పార్టీలో ఉండటం వైసీపీ కార్యకర్తలకు శాపం.