వైసీపీకి చెందిన సాక్షి ఛానెల్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరించడాన్ని ఖండించకపోగా… నిసిగ్గుగా సమర్థించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే రాజధాని ప్రాంత మహిళలపై మరోసారి అక్కసు వెళ్ళగక్కారు. వారిని తీవ్ర పదజాలంతో దూషించారు.
కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అమరావతి ప్రాంత మహిళల మనోభావాలను కించపరిచాయి. దీంతో మహిళలు కృష్ణంరాజు , సాక్షి ఛానెల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస రావులకు బుద్ధి రావాలంటూ వారి చిత్రపటాలపై చెప్పులతో దాడి చేశారు. దీంతో ఈ నిరసనలు చేసిన మహిళలను పిశాచాలు , రాక్షసులు అంటూ సజ్జల నోరు పారేసుకున్నారు. ఆవేదనతో నిరసన చేస్తున్న మహిళలను సంకర తెగ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు.
నిరసనలు చేసిన తెగ అర్గనైజ్డ్గా ఉన్న సంకర తెగ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అనడం వివాదాస్పదంగా మారింది. అసలే అమరావతి రైతులు ఫైర్ మీద ఉండగా ఇప్పుడు సజ్జల వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉన్నాయి. ఇప్పటివరకు సాక్షి ఛానెల్ పై ఆగ్రహంగా ఉన్న అమరావతి మహిళలు..సజ్జల వ్యాఖ్యలతో వైసీపీపై కూడా తిరుగుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది