జగన్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం క్యాడర్ ను బలి చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఏదో ఓ రచ్చ చేయించి క్యాడర్ పై కేసులు పెట్టిస్తున్నారు. రాప్తాడుకు వెళ్లి అదే చేశారు. తెనాలికి వెళ్లి అదే చేశారు. ఇప్పుడు పొదిలికి వెళ్లి మహిళలు, పోలీసులపై దాడులు చేయించి చాలా మంది కార్యకర్తల జీవితాలను రిస్క్ లో పెట్టేశాడు. పొగాకు రేట్లు తగ్గాయని ప్రచారం చేయడానికి జగన్ రెడ్డి పొదిలి వెళ్లారు. అక్కడ కొంత మంది మహిళలు నిరసన చేపట్టారు.
ఆ నిరనస ఎక్కడో రోడ్డుపక్కన జరుగుతూంటే వారిపై దాడి చేసేలా జగన్ ప్రేరేపించారు. దీంతో కార్యకర్తలు ఆ మహిళలపై రాళ్లు విసిరారు. మహిళలతో పాటు డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ కు గాయమైంది. దాడులు చేసిన వారిని వదిలి పెట్టే అవకాశం ఉండదు. కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేసిన వారిని వదిలి పెట్టరు. జగన్ రెడ్డికి కావాల్సింది కూడా ఇదే. తన కార్యకర్తలు కేసుల పాలైపోయినా పర్వాలేదు.. తనకు రాజకీయ సరుకు కావాలనుకుంటున్నారు. ఇలా జైలుకెళ్లే వారికి కనీసం న్యాయ సాయం కూడా అందదు.
వీరి కుట్రలు ఎలా ఉంటాయంటే ఈ ఘటన జరగగానే అంబటి రాంబాబు పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. కాల్పులు జరగిపోతాయని హెచ్చరించారు. తర్వాత పోలీసు కేసుల కారణంగా తమ క్యాడర్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్తను పరామర్శిస్తారని కూడా ప్రకటించారు. క్యాడర్ ను గాలికొదిలేసిన ఆయన ఇప్పుడు పట్టించుకుంటున్నానని కలరింగ్ ఇచ్చుకోవడానికి పరామర్శకు వెళ్తున్నారు. వారి జీవితాల్ని రిస్క్ లో పెట్టేది జగన్ రెడ్డి.. మళ్లీ వారికి పరామర్శలు చేసేది కూడా ఆయనే.