బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ ఫామ్ హౌజ్ నుంచి ఆయన హైదరాబాద్ కు కాసేపటి క్రితమే బయల్దేరారు. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కోసమే ఆసుపత్రికి వెళ్తున్నట్టు చెప్పారు. కానీ, సడెన్ గా రెగ్యులర్ చెకప్స్ కోసం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లడంపై చర్చ జరుగుతోంది.
ఇటీవల కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు అయ్యారు. కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందోనని చాలా రోజులు, చాలాసేపు సుదీర్ఘంగా కసరత్తు చేసి వెళ్లారు. దాదాపు గంటపాటు ఆయనను విచారించింది పీసీ ఘోష్ కమిషన్. అయితే, కాళేశ్వరం కమిషన్ విచారణతో కేసీఆర్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని గుసగుసలు వినిపించాయి.
కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసుల బెడద ఉండగా… కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసు ఉంది. ఆయనను మరోసారి విచారణకు హాజరు కావాలని కోరుతూ తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏసీబీ తీవ్ర కసరత్తు చేసిన తర్వాతే కేటీఆర్ కు సెకండ్ టైం నోటీసులను పంపింది అని, ఈ సారి కేటీఆర్ అరెస్ట్ తప్పదు అనే టాక్ ప్రారంభమైంది.
కేటీఆర్ ఇష్యూతోపాటు కేసీఆర్ కు కవిత తలనొప్పి ఉండనే ఉంది. దీంతో కేసీఆర్ కొన్ని రోజులుగా జరుగుతూన్న వరుస పరిణామాలతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు అని, చాలా బలహీనంగా కూడా మారారు అని అంటున్నారు. అందుకే ఆయన సడెన్ గా హెల్త్ చెకప్స్ పేరిట ఏఐజీకి బయల్దేరారని అంటున్నారు.