పవన్ కల్యాణ్ తన పిల్లల చదువులను సింగపూర్ నుంచి హైదరాబాద్కు మార్పించారు. అంతర్జాతీయ స్థాయి విద్య అవసరమని.. ఇప్పటి వరకూ సింగపూర్ స్కూల్స్లో చదివించారు. అయితే ఇటీవల అక్కడ అగ్నిప్రమాదంలో కుమారుడు చిక్కుకోవడంతో మనసు మార్చుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది నుంచి హైదరాబాద్లోనే చదివించాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో చేర్పించారు. శుక్రవారం ఉదయం ఆయన ఆ స్కూల్కువెళ్లారు. ఆ స్కూల్లో కేవలం నాలుగు వందల మంది విద్యార్థులే ఉంటారు. పన్నెండో తరగతి వరకూ ఆ స్కూల్లో ఉంటుంది. ఫీజులు కడతామని వచ్చే వారందర్నీ చేర్చుకోరు. పరిమితంగానే సీట్లు ఉంటాయి. ఇతర దేశాల నుంచి వచ్చి చేరేవారు ఎక్కువగా ఉంటారు. విద్యార్థుల్లో సగానికిపైగా ఇతర దేశాలకు చెందిన వారు ఉంటారు. అలాగే టీచర్లు కూడా ఇక్కడి వారు మాత్రమే ఉండరు. సగం మంది టీచర్లు పలు దేశాలకు చెందిన వారు ఉంటారు.
ఈ స్కూల్లో అంతా అంతర్జాతీయ స్థాయి పాఠాలు చెబుతారు. సర్టిఫికెట్లు కూడా అంతర్జాతీయ యూనివర్శిటీలే ఇస్తాయి. బట్టి పట్టించని.. మార్కులు ఉండని వ్యవస్థ అక్కడ ఉంటుంది. ఇక్కడ చదువుకున్న తర్వాత నేరుగా విదేశాలకు వెళ్లి .. ప్రముఖ యూనివర్శిటీల్లో చేరిపోవచ్చు. మహేష్ బాబు పిల్లలుకూడా ఇక్కడే చదువుతారు. మహేష్ కుమారుడు ఇక్కడ చదువుపూర్తి చేసుకుని విదేశాలకు వెళ్లారు. అల్లు అర్జున్ పిల్లలతో పాటు మరికొంత మంది సినీ సెలబ్రిటీల పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో చదువుతున్నారు.