జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఎప్పుడూ ఏడ్చే ఏడుపే ఏడ్చారు. గడ్డు చేసుకోవడానికి ఇష్టం లేక.. నిద్ర పట్టక ..కళ్లు పీక్కుపోయిన ముఖంతో ప్రెస్మీట్ పెట్టారు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డినో .. ఆయన నియమించిన మరో బూతుల జర్నలిస్టో రాసిచ్చిన స్క్రిప్టు చదివారు. అందరిపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నాడని ఫీలయ్యారు. ఎప్పుడో ఏదో జరిగిందని కక్ష తీర్చుకోవాలనుకోవడానికి చంద్రబాబు మొదటి సారి సీఎం కాలేదు కదా…. నాలుగోసారి సీఎం అయ్యారు. జగన్ రెడ్డి చెప్పే పిట్టకథల్లో నిజం ఉంటే.. వారు పని ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండేది.
జగన్ రెడ్డి ఇలాంటి కథలు చెప్పడానికి ఎంత తీవ్రమైన ద్వేషంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మానసిక పరిస్థితి అత్యంత ప్రమాదకరం. ఈ విషయంపై ఆయన సన్నిహితులకు స్పష్టత ఉందేమో కానీ.. చేతి వేలికి హెల్త్ ట్రాకర్ తొడిగించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు .. బయట నుంచి వైద్యులు ట్రాక్ చేస్తూంటారేమో కానీ.. పదే పదే ఆ ట్రాకర్ ను కూడా పట్టుకుని తిప్పుతూ ఉన్నారు.
చంద్రబాబు హెల్త్ ట్రాకర్ పెట్టుకున్నప్పుడు.. కూడా జగన్ అవహేళన చేశారు. చంద్రబాబు బుర్రలో చిప్ ఉండాలి కదా అని కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబు వయసు ఏడు పదులు దాటింది. ఆయన హెల్త్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేయించుకుంటారు. కానీ కుర్రాడినని చెప్పుకునే జగన్ రెడ్డికి అప్పుడే హెల్త్ ట్రాకర్ ఎందుకు?. గతంలో చంద్రబాబును హేళన చేసింది గుర్తు లేదా ?. హెల్త్ ట్రాకర్ లో చిప్ ఉందో లేదో కానీ.. జగన్ రెడ్డికి మాత్రం చిప్ లేదని ఎక్కువ మంది అనుకుంటున్నారు.. దానికి కారణం జగన్ ప్రవర్తనే.