హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లగ్జరీ ప్రాజెక్టుల్లో ఇప్పటికీ పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఎంక్వయిరీలు కూడా ఊపు పెరుగుతుందున్న సంకేతాలు ఇస్తున్నాయి కానీ.. కొనుగోలు వరకూ రావడం లేదు. దానికి కారణం అధిక ధరలు మాత్రమే కాదు.. ఎన్నారైలు కూడా పెట్టుబడుల విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉండటమే కారణమని భావిస్తున్నారు.
ఎన్నారైలు ముఖ్యంగా అమెరికాలో సెటిలైన వారు.. తమ సొంత ప్రాంతంలో ప్రాపర్టీ ఉండాలని అనుకుంటారు. ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా ఇల్లే అవుతుంది. సొంత ప్రాంతం అంటే.. సొంత గ్రామం లేదా ఉరు అనుకోవడం లేదు. కేవలం హైదారాబాద్ అనుకునేవారు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే.. హైదరాబాద్ లో అయితే పెట్టుబడికి తగ్గ రిటర్న్స్ కూడా వస్తాయని అంచనా వేసుకుంటారు. అందుకే గతంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు పెట్టుబడులు పెట్టేవారు. ఇప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అమ్మకాల్లో ఎన్నారైలది 30 శాతం అని చెబుతూంటారు. ఇప్పుడు వివిధ కారణాల వల్ల ఆపర్సంటేజీ తగ్గిపోతోంది.
అమెరికాతో పోలిస్తే ఇక్కడ ధరలు ఆ రేంజ్ లోనే ఉండటం.. ఇప్పుడు పెట్టుబడి పెట్టినా.. ఐదు, పదేళ్ల తర్వాత అదే రేటు ఉంటుందని పెరుగుదల ఉండదని భయపడుతున్నారు. అదే సమయంలో ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే ఇప్పుడు ఐదు శాతం పన్ను కట్టాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో .. అమెరికాలో స్థిరపడిన వారు.. ఆ ఇన్వెస్ట్ మెంట్లు ఏదో… అమెరికాలో చేసుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచించేవారు పెరిగే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు కొత్త సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.