ఉద్దేశపూర్వకంగా చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తే పలువురి మరణాలకు కారణం అవుతూ, శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇక ఉపేక్షించకూడదని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. పాత కేసుల్లోనూ ఇప్పుడు నోటీసులు జారీచేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మిర్చియార్డులో పర్యటించి హంగామా చేశారు. ఎన్నికల కమిషన్ నుంచి కనీస అనుమతి తీసుకోకుండా తాము అభ్యర్థిని పెట్టలేదు కాబట్టి తమకు కోడ్ వర్తించదని వారికి వారుచెప్పుకుని రచ్చ చేశాయి.
ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో విద్యార్థులతో కలిసి రోడ్డెక్కినందుకు మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులపై ఎన్నికల సంఘం కేసులు పెట్టింది. అప్పటికి వారు ఏ పార్టీలో లేరు. అయినా రూల్స్ ఉల్లంఘించారని కేసులు పెట్టారు. ఎన్నికల్లో పోటీకీ.. ఎన్నికల కోడ్ అమలుకు సంబంధం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అందరూ రూల్స్ పాటించాల్సిందే. కానీ జగన్ మాత్రం.. చట్టాలకు తాను అతీతుడ్నన్నట్లుగా వ్యవహరించారు.
మర్చియార్డు పర్యటనలో చేయాల్సినంత రచ్చ చేశారు. అప్పట్లోనే జగన్ తో పాటు గుంటూరు జిల్లా నేతలపై కేసులు నమోదయ్యాయి. పిలిచినప్పుడుడ విచారణకు రావాలని ఇప్పుడు నల్లపాడు పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలు, నేతల విషయంలోనూ ఇక చట్ట ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.