ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి తాను బ్రాండ్ ఆంబాసిడర్ గా ఉండేందుకు సిద్ధమేనని యోగా గురు, పతంజలి సంస్థ ఓనర్ బాబా రాందేవ్ తెలిపారు. విజయవాడలో టూరిజం కాంక్లేవ్ లో బాబా రాందేవ్ పాల్గొన్నారు. పతంజలి సంస్థ తరపున పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. బాబా రాందేవ్ ఒప్పుకుంటే.. ఏపీ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలన్నారు. దానికి బాబా రాందేవ్ ఆమోదం తెలిపారు.
చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం కురిపించారు బాబా రాందేవ్ మదనపల్లిలోని హార్సిలీ హిల్స్ లో అంతర్జాతీయ స్థాయి వెల్ నెస్ సెంటర్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పతంజలి సంస్థ ఇప్పటికే పలు చోట్ల వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రకృతి సిద్ధ వైద్యంలో మంచి పేరు ఉన్న పతంజలి.. హార్సిలీ హిల్స్ లో ఈ సెంటర్ పెడితే.. ప్రకృతి వైద్య పర్యాటకం బాగా పెరిగే అవకాశం ఉంది.
ఉత్తరాది ప్రజలకు పూర్తి స్థాయిలో ఏపీలోని పర్యాటక ప్రాంతాల గురించి తెలియవన్నారు. వారికి ఇక్కడి విశేషాలను తెలియచెప్పి.. ఏపీకి పర్యాటకుల్ని పెంచేందుకు ప్రయత్నిస్తానన్నారు. యోగా గురుగా ప్రసిద్ధి చెందిన బాబా రాందేవ్.. పతంజలి సంస్థతో ఆయుర్వేద ఉత్పత్తులు అమ్మేవారు. ఆ సంస్థను ఇప్పుడు బహుముఖాలుగా విస్తరించి.. ఆయుర్వేద ఉత్పత్తుల్లో కార్పొరేట్ సంస్థగా చేశారు.