రోజూ ఓ మొక్కను చూసే వారికి మూడేళ్లలో ఆ మొక్క ఎంత పెరిగిందో చూసి ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే ఆ పెరుగుదల రోజూ చూస్తారు. నిన్న ఎంత ఉందో.. ఇవాళ కూడా అంతే ఉంది కదా అనిపిస్తుంది. కానీ మూడేళ్ల కిందట ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉంటుందో అని చూస్తేనే ఆ తేడా కనిపిస్తుంది. అలాంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. రాజధాని అమరావతి మూడేళ్ల తర్వాత ఎలా ఉంటుంది ?.
ఏడాది కిందట అమరావతి పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఐదు సంవత్సరాలపాటు సైకోతనానికి బలయింది. ఏడాదిలో అక్కడ పూర్తిగా మారిపోయింది. పిచ్చి మొక్కలన్నీ అయిపోయాయి. అప్పట్లో జన సంచారం ఉండేది కాదు. ఇప్పుడు పది వేల మంది పని చేస్తున్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో ఇరవై వేల మందికి పైగా వచ్చి అక్కడ పని చేస్తూంటారు. అంత మంది పని చేస్తూంటే.. రోజూ ఎంత మేర కట్టడాలు, నిర్మాణాలు రెడీ అవుతాయో ఊహించవచ్చు.
మూడు ఏళ్లలో అమరాతిని ఓ రూపు తీసుకు రానున్నారు. గతంలో అయితే ప్లాన్లు, పునాదులకు సమయం కేటాయించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పునాదుల నుంచి నిర్మిస్తే సరిపోతుంది. పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్లలో పాలనా టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ అందుబాటులోకి వస్తాయి. ప్రైవేటు సంస్థల కార్యకలాపాలూ పెరుగుతాయి. ఉపాధి పెరుగుతుంది. పాజిటివ్ వాతావరణం .. శాంతిభద్రతల సమస్యలు సృష్టించని వారు ఉంటే.. ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టం. మూడేళ్ల తర్వాత ఊహించని అభివృద్ధి కనిపించడం ఖాయమని అనుకోవచ్చు.