ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థను గాడిన పెట్టడం ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఇప్పటికీ పోలీసులు సెటిల్మెంట్లు, మాఫియా వేషాలు వేస్తూనే ఉన్నారు. అది కూడా వైసీప నేతల కోసం. పులివెందుల పోలీసులు చేసిన మాఫియా డీలింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. పోలీసుల తీరుపై విమర్శలకు కారణం అవుతోంది.
దుష్యంత్ రెడ్డి అనే జగన్ రెడ్డి మిత్రుడు కడప వైసీపీలో ఉన్నాడు. ఆయన కమలాపురం ఇంచార్జ్ గా కొన్నాళ్లు చేశాడు. ఆయన తండ్రి ఇటీవల హఠాత్తుగా చనిపోయాడు. ఆయన తన డైరీలో తనకు ఫలానా వాళ్లు డబ్బులివ్వాలని రాసుకున్నాడు. ఎలాంటి ఆధారాలు లేవు. దాంతో పోలీసుల్ని రంగంలోకి దింపాడు. ఆ డైరీలో ఉన్న పేర్లతో పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
అంతే పులివెందుల పోలీసులు బెంగళూరు వెళ్లి వాళ్లందర్నీ పట్టుకొచ్చేశారు. సీఐ ఇంట్లో కూర్చోబెట్టి.. సెటిల్మెంట్ చేశారు. పది కోట్లు చెల్లిస్తామని ఒప్పందం రాయించినట్లుగా చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ లావాదేవీలు పులివెందులకు సంబంధం లేనివి . అయినా జగన్ రెడ్డి మిత్రుడి కోసం పులివెందుల పోలీసులు మాఫియా వేషం వేశారు సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల్ని వాడుకుని నేరాలు చేయడంలో వైసీపీ నేతలు దిట్ట. ఇప్పుడు మరోసారి బలపడింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా భయం లేకుండా పోలీసులు ఇలాంటి పనులు చేస్తూండటమే… వ్యవస్థ గాడిలో పడలేదనడానికి నిదర్శనం అనుకోవచ్చు.