యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అర్థరాత్రి లాయర్ తో కలిసి చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆత్మహత్యకు కారణం అనే ఆరోపణలు ఉన్నాయి కానీ.. స్వేచ్ఛ ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. దాంతో పూర్ణచందర్ ను అరెస్టు చూపించలేకపోయారు. కానీ అనూహ్యంగా స్వేచ్ఛ కుమార్తె మనపైనా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు.
స్వేచ్ఛ కుమార్తెను తన కుమార్తెలా చూసుకున్నానని..స్కూల్లో చేర్పించి ఫీజులు కడుతున్నానని పూర్ణచందర్ మీడియాకు రిలీజ్ చేసిన ఓ లేఖలో చెప్పుకున్నాడు. ఆమె ఫంక్షన్కు తాను ఐదు లక్షలు ఖర్చు పెట్టానని కూడా చెప్పుకున్నాడు. కానీ స్వేచ్ఛ కుమార్తె మాత్రం భిన్నంగా చెబుతున్నారు. పూర్ణచందర్ ప్రవర్తన ఏ మాత్రం బాగా ఉండేది కాదని మీడియాకు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో పూర్ణచందర్ నిండా మునిగిపోయాడు. స్వేచ్ఛ తల్లిదండ్రులపై రివర్స్ ఆరోపణలు చేసిన అతను..ఆమె కుమార్తె ఫిర్యాదుతో బయటపడలేని పరిస్థితికి వచ్చాడు. స్వేచ్ఛ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పరిశీలనలో అనుమానాస్పద అంశాలు ఏమైనా బయటపడితే.. అవి సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.