క‌బాలి క్లైమాక్స్ క‌ల‌వ‌రం

క‌బాలినిని ఎప్పుడెప్పుడు చూద్దామ‌నా అని ఎదురుచూస్తున్న ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ నిరీక్ష‌ణకు మ‌రికొద్ది గంట‌ల్లో తెర‌ప‌డ‌నుంది. క‌బాలి వ‌చ్చేస్తున్నాడు. ఆ సంబ‌రాలు చెన్నై అంత‌టా మొద‌లైపోయాయి. ఈలోగా క‌బాలికి సంబంధించిన కొత్త కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. దాదాపుగా అవ‌న్నీ ర‌జ‌నీ ఫ్యాన్స్ సంతోషాన్ని రెట్టింపు చేసేవే. అయితే ఓ విష‌యం మాత్రం.. ర‌జ‌నీ ఫ్యాన్స్‌కి మింగుడు ప‌డేది కాదు. ఔను… క‌బాలి క్లైమాక్స్ ర‌జ‌నీ ఫ్యాన్స్ ఊహ‌కు అంద‌న‌ట్టుగా ఉంటుంద‌ట‌. ఇదో విషాదాంత‌మైన క‌థ అని తెలుస్తోంది.

ద‌ర్శ‌కుడు రంజిత్ క‌థ చెప్పిన‌ప్పుడే ‘ఇదో శాడ్ ఎండింగ్‌’ అంటూ చెప్పేశాడ‌ట‌. అయితే ర‌జ‌నీ కుమార్తె ఐశ్వ‌ర్య మాత్రం ‘ఇలాంటి ముగింపు వద్దు… హ్యాపీ ఎండింగ్ కావాలి’ అని రంజిత్‌ని కోరింద‌ట‌. రంజిత్ కూడా క్లైమాక్స్ మార్చేద్దాం అనే ఆలోచ‌న‌లో ఉండ‌గా.. ర‌జ‌నీ కాంత్ మ‌ళ్లీ రంజిత్‌ని పిలిపించి ”నువ్వు ఎలా కోరుకొన్నావో అలానే ఈ సినిమాని తీయ్‌. క్లైమాక్స్ మార్చ‌కు. ఈ సినిమాకు ఆ క్లైమాక్సే క‌రెక్ట్‌” అన్నాడ‌ట‌. దాంతో రంజిత్ తాను రాసుకొన్న‌ట్టుగానే సినిమా తీశాడు. ఇప్ప‌టికీ ఐశ్వ‌ర్య‌కు ఈ క్లైమాక్స్‌పై డౌట్లు ఉన్నాయ‌ని.. చివ‌రి క్ష‌ణాల వ‌ర‌కూ క్ల‌యిమాక్స్‌ని మార్చ‌డానికి ప్ర‌య‌త్నించింద‌ని టాక్‌. త‌మిళ వాసుల‌కు యాంటీ క్ల‌యిమాక్స్‌లు న‌చ్చుతాయి. కానీ తెలుగుప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ఎక్క‌వు. ఆ ప్ర‌భావం తెలుగు వ‌సూళ్ల‌పై ప‌డుతుందేమో అన్న భ‌యం ప‌ట్టుకొంది. మ‌రి క‌బాలి ఏం మ్యాజిక్ చేస్తాడో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close