విశాఖ సాగరతీరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

దేశ 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి విశాఖ సాగర తీరంలో ఘనంగా నిర్వహించింది. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మువ్వన్నెల జెండా ఎగురవేశారు. అనంతరం రాష్ర్ట పోలీసులు, హోం గార్డులు, ఎన్.సి.సి. కోరుకొండ సైనిక స్కూల్ విద్యార్ధుల బృందాలు బీచ్ రోడ్డులో పెరేడ్ చేసి ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఆకర్షణీయంగా తీర్చిద్దబడిన శకటాలు ప్రదర్శించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, పలువురు జిల్లా మంత్రులు, డిజిపి జెవి రాముడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖనగరంలో నిర్వహించడంతో నగర ప్రజలు కూడా చాలా సంతోషించారు. సాగరతీరంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారనే సంగతి తెలుసు కొని ప్రజలు భారీగా తరలివచ్చారు. నగర సందర్శనానికి వచ్చిన పర్యాటకులు కూడా ఈ వేడుకలను చూడటానికి తరలివచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close