జ‌న‌తాలో .. జై బాల‌య్య‌

జ‌న‌తా గ్యారేజ్ హంగామా ఓ రేంజులో సాగుతోంది. అర్థ‌రాత్రి ప్రీమియ‌ర్ షోల్లో క‌నిపించిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ సినిమాకెప్పుడూ లేని స్థాయిలో.. ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేశారు. హైద‌రాబాద్‌లో దాదాపు 10 థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ షోలు వేశారు. ప‌ది చోట్లా హౌస్ ఫుల్సే. స‌రిగ్గా అర్థరాత్రి 3 గంట‌ల‌కు షోలు ప‌డిపోయాయి. థియేట‌ర్ల‌లో మాత్రం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన గోల అంతా ఇంతా కాదు. అయితే.. అదే స‌మ‌యంలో థియేట‌ర్లో అనూహ్యంగా జై.. బాల‌య్య నినాదాలూ మిన్నంటాయి. ఓ సంద‌ర్భంలో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. – జై ఎన్టీఆర్ అనీ, ఇటు బాల‌య్య ఫ్యాన్స్ జై.. జై బాల‌య్య అంటూ.. అరుపుల‌తో థియేటర్‌ని మోతెక్కించారు. చూస్తుంటే ప‌రిస్థితి ఉదృతంగా మారేట్టే క‌నిపించింది. కానీ.. మ‌ళ్లీ.. ‘ఒక్క‌టే ఒక్క‌టే.. మ‌న‌మంతా ఒక్క‌టే’ అంటూ నినాదాలు చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఇంచు మించు చాలా థియేట‌ర్ల‌లో ఇదే ప‌రిస్థితి. బాల‌య్య – ఎన్టీఆర్‌ల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌న్న విష‌యం ప‌రిశ్ర‌మ కోడై కూస్తోంది. నంద‌మూరి ఫ్యాన్స్ కూడా చెరో వైపుకు చేరిపోయారు. అప్ప‌ట్టుంచీ బాల‌య్య ఫ్యాన్స్ , ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ డివైడ్ అయిపోయారు. అయితే.. జ‌న‌తా గ్యారేజ్ కోసం ఇద్ద‌రి ఫ్యాన్స్ కలిసిపోయినంత సంబ‌రం క‌నిపించింది. మ‌నమంతా ఒక్క‌టే అంటూ.. అర‌చుకోవ‌డం కూడా ఓ స‌రికొత్త వాతావ‌ర‌ణానికి నాంది ప‌లికిన‌ట్టైంది. సినిమా ఎలా ఉన్నా… థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ చేసిన హంగామా, జై బాల‌య్య నినాదాలూ… అంద‌రికీ గుర్తుండిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. ...

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close