జగనూ మంచోడే..బాబూ మంచోడే…

ఒకప్పుడు తమలో వీసమెత్తు పొరపాటు చూపిస్తే రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేసి తప్పుకొనేవారు. వారు మహానుభావులు. రాజకీయాలకు గీటురాళ్ళ వంటివారు. కానీ నేడు తీవ్ర నేరారోపణలపై జైలుకి వెళ్లి వచ్చినా, అవినీతి కేసుల్లో కోర్టులు శిక్షలు విధించినా, ఫోన్ ట్యాపింగ్, స్టింగ్ ఆపరేషన్లలో అడ్డంగా దొరికిపోయినా తాము నిప్పులాంటి వాళ్ళమని నిసిగ్గుగా చెప్పుకొంటూ తిరుగుతున్నారు. కోర్టులలో సాక్ష్యాధారాలతో సహా నేరారోపణలు ఎదుర్కొంటున్నా కూడా అవన్నీ తమ ప్రత్యర్ధులు రాజకీయ కక్షతో పెట్టిన భూటకపు కేసులని వాదిస్తున్నారు. తమ రాజకీయ ప్రత్యర్ధులు ఉద్దేశ్యపూర్వకంగానే తమపై కుట్రలు పన్ని ఉచ్చులో పడేశారని నిసిగ్గుగా వాదిస్తున్నారు. జైల్లో ఉండి వచ్చిన మన రాజకీయ నేతలు అదేదో చాలా ఘనకార్యమన్నట్లు ప్రజలకు రెండు వేళ్ళతో విక్టరీ సింబల్ చూపిస్తూ భారీ ఊరేగింపుగా జైలు నుండి బయలుదేరుతున్నారు.

దురదృష్టకరమయిన విషయం ఏమిటంటే ప్రజలు కూడా అటువంటి వారి తప్పులను చాలా ఉదారంగా క్షమించేయడమే కాకుండా మళ్ళీ వారికే జై కొడుతుంటారు. అటువంటప్పుడు నేరం చేసిన ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు భయపడతాడు? ఎందుకు సిగ్గుపడతాడు? ఓటుకి నోటు కేసులో కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. అలాగే ఆయన ఆ కేసు నుండి ఏవిధంగా తెలివిగా బయటపడ్డారో అందరికీ తెలిసిందే. కానీ ఆయన తను నిప్పులాగ బ్రతుకుతున్నానని చెప్పుకొన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా తను అనుసరిస్తున్న విధానాల వలననే ప్రజలలో తనకు విశ్వసనీయత ఉందని అదే తనకు శ్రీరామ రక్ష అని చెప్పుకొన్నారు. ప్రజలు తమ గురించి ఏమనుకొంటున్నారనే విషయం తెలుసుకొంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ తమ గురించి తామేమనుకొంటున్నామనే సంగతి ప్రజలకి చెప్పడానికి చాలా సౌక్యంగా, గొప్పగా ఉంటుంది. అందుకే మన రాజకీయ నాయకులు తాము చెప్పేదే నిజమని ప్రజలను నమ్మమని గట్టిగా చెపుతుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close