గ్రీన్‌కార్డ్ వదులుకుని సమాజసేవలో ఆదర్శంగా నిలుస్తున్న ఎన్ఆర్ఐ

హైదరాబాద్: వంద మంచి మాటలు చెప్పటంకన్నా ఒక చిన్న మంచిపని చేయటం గొప్పదన్న సూత్రాన్ని అనుసరిస్తూ సమాజంకోసం తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడొక ఎన్ఆర్ఐ. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను మెరుగుపరచటంకోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టటమేకాకుండా తన ఏకైక కుమార్తెనుకూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకాశంజిల్లా చీరాల పట్టణానికి చెందిన మాచిరాజు వంశీ అమెరికాలో మంచి ఉద్యోగాన్ని, గ్రీన్‌కార్డ్ పొందే అవకాశాన్నికూడా వదులుకుని 2013లో ఇండియాకు తిరిగొచ్చేశారు. హైదరాబాద్‌లో స్థిరపడిన వంశీ ‘ఆర్గనైజేషన్ ఫర్ ది ఫ్యూచర్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాల మెరుగుదలకోసం, మహిళల స్వావలంబనకోసం, యువతలో నైపుణ్యాల అభివృద్ధికోసం ఈ సంస్థ పనిచేస్తోంది. పేదల అభ్యున్నతికోసం కృషిచేయాలంటే ముందు తానుకూడా వారిలో భాగంకావాలని తాను భావించిన వంశీ కాప్రాలో తానుండే కాలనీలోని స్కూల్ డెవలెప్‌మెంట్ టీమ్‌లో భాగస్వామిగా మారారు. తన కుమార్తెను మొదట ఒక ప్రైవేట్ పాఠశాలలో చేర్పించినప్పటికీ, తర్వాత కాప్రాలోని జిల్లాపరిషత్ హైస్కూల్‌లో మార్చారు. లలితా ప్రణీత అనే ఆ ఆమ్మాయి ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. అమెరికానుంచి వచ్చిన ప్రణీతకు మొదట్లో ఇక్కడి క్లాస్‌మేట్స్‌తో, టీచర్లతో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉండేది. అమెరికన్ స్కూల్స్‌లో చదువు చెప్పే విధానం, ఇక్కడి విధానం పూర్తి భిన్నంగా ఉందని ప్రణీత చెప్పింది. అమెరికా పాఠశాలల్లో చదువుకోవటం ఇంటరాక్టివ్‌గా ఉంటుందని, ఇక్కడంతా బట్టీపట్టమే ఉంటుందని పేర్కొంది. ప్రణీత, తండ్రి వంశీ కలిసి ఆమె క్లాస్‌లోని ఐదారుగురు పిల్లలకు పాఠాలు నేర్పుతున్నారు. మ్యాథ్స్, ఇంగ్లీష్, బయాలజీ, కంప్యూటర్స్ సబ్జెక్ట్‌లను చెబుతుంటానని ప్రణీత చెప్పింది. ఇక్కడి పాఠశాలలో తాను మంచి లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నానని తెలిపింది.

మరోవైపు మాచిరాజు వంశీ కాలనీలో యువతలో నైపుణ్యాల అభివృద్ధికోసం, మహిళల స్వావలంబనకోసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక అమెరికా వెళ్ళబోనని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలేమీ చేయబోనని సమాజసేవపైనే దృష్టిపెడతానని అంటున్నారు. చేయగలిగిన్నాళ్ళు ఇది చేస్తానని, లేకపోతే తన గ్రామంలో వ్యవసాయం ఉండనే ఉందని వంశీ చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close