తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణా రాష్ట్రంలో చతికిలపడిన రియాల్టీ వ్యాపార రంగం పుంజుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వం అనూహ్యమయిన నిర్ణయం తీసుకొంది. ఇంతవరకు 2013 మాస్టర్‌ప్లాన్ నిబంధన ప్రకారం కనీసం పదెకరాలు విస్తీర్ణం ఉన్న లే-అవుట్లకు మాత్రమే అనుమతులు మంజూరు అయ్యేవి. కానీ ఇప్పుడు ఎకరం విస్తీర్ణం ఉన్న లే-అవుట్లకు కూడా అన్ని అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అందుకుగాను శుక్రవారం ఒక జీ.ఓ.(నెంబర్ 102)ని కూడా విడుదల చేసింది. ఇంతకు ముందు ఈ 10ఎకరాల నిబంధన వలన పెద్దపెద్ద రియాల్టీ సంస్థలు కూడా ప్రభుత్వ అనుమతులు పొందలేక అక్రమ లే-అవుట్లు వేసి ప్రజలకు అమ్మడం వలన ప్రజలు చాలా నష్టపోయేవారు. అంతే కాకుండా వాటి వలన ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగడమే కాకుండా న్యాయ పోరాటాల కోసం తిరిగి డబ్బు ఖర్చు చేయవలసి వచ్చేది. ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణా ప్రభుత్వం ఎకరం విస్తీర్ణంలో వేసిన లే-అవుట్లకు అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించుకొంది. కనుక ఇకపై చిన్నచిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు కూడా చిన్నచిన్న లే-అవుట్లు వేసుకొనే అవకాశం ఏర్పడింది. దేనివలన తెలంగాణాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అతి తక్కువ సమయంలోనే చాలా వేగం పుంజుకావచ్చును. త్వరలో సింగిల్ విండో విధానంలో ఆన్-లైన్ ద్వారా భవనాలకు, లే-అవుట్లకు అనుమతులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close