రెండో రోజే సస్పెన్షన్ల పర్వం

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రెండో రోజే 11 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండయ్యారు. వాయిదా తీర్మానాలపై పట్టుబట్టిన 9 మంది కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర పట్టుబట్టారు. స్పీకర్ సభలోకి వచ్చీ రాగానే తమ డిమాండ్ పై పట్టుబట్టారు. దీంతో వీరందరినీ స్పీకర్ ఒక రోజు సస్పెండ్ చేశారు.

సమావేశాల తొలిరోజు పెద్ద నోట్ల రద్దు, పర్యవసానాలపై చర్చ జరపాలని ముందే నిర్ణయించారు. దీంతోప్రతిపక్షాలు మరో అంశంపై పట్టుబట్టలేదు. ఈ అంశంపై ఎవరికి వారు తమ వాదన వినిపించడానికి సిద్ధపడి వచ్చారు. రెండో రోజు శనివారం మాత్రం మళ్లీ అరుపులు నినాదాలు డిమాండ్లు వినిపించాయి.

శుక్రవారం ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ఇవే సీన్లు కనిపించాయి. అయితే సభ్యులను సస్పెండ్ చేయకుండా సభను వాయిదా వేశారు. అసెంబ్లీలోమాత్రం సభను వాయిదా వేయకుండా కొనసాగించారు. సభకు ఆటంకం కలిగించే వారిని బయటకు పంపారు.

సస్పెండ్ అయిన తర్వాత రేవంత్, సండ్ర స్పీకర్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. అయితే వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. స్పీకర్ వైఖరిపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. అవసరమైతే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. స్పీకర్ పరిధిలో ఉన్న అంశంపై పట్టుబట్ట వద్దని స్వయానా స్పీకరే చెప్పారు. ఇది తన విచక్షణకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష సభ్యుల డిమాండ్లు సహేతుకమా కాదా అనేది వేరే విషయం. సభకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని అధికార పార్టీ ఈ విధంగా స్పష్టం చేసింది. దీనపై సీఎల్ పి నాయకుడు జానారెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. అయినా, సభలోచర్చ తప్ప రచ్చకు అవకాశం లేదని కేసీఆర్ ప్రభుత్వం కచ్చితమైన సంకేతాన్ని ఇచ్చినట్టయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close