ప్రస్తుతం మైల్ స్టోన్ సినిమాల సీజన్నడుస్తోంది. చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా హడావుడిలో ఉంది టాలీవుడ్. ఇప్పుడు వెంకటేష్ 75వ సినిమా రాబోతోంది. కథానాయకుడిగా ‘గురు’ వెంకీకి 71వ చిత్రం. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందే ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’ వెంకీ 72వ చిత్రం. ఇవి కాక రెండు చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించాడు వెంకీ. ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో రానా పక్కన స్టెప్పులేశాడు. ‘ప్రేమమ్’ కోసం తళుక్కు మెరిసి మాయమయ్యాడు. ఆ రెండూ కలుపుకొంటే వెంకీ ఖాతాలో 74 సినిమాలు చేరిపోయినట్టు. కిషోర్ తిరుమల సినిమా తరవాత మొదలయ్యేది వెంకీ 75వ సినిమా అవుతుంది. యువతరం హీరోలు దూసుకొస్తున్నారు.. మరోవైపు వెంకీ వయసూ పైబడుతోంది. ఎంత ఫాస్ట్గా చేసినా వంద సినిమాల మైలు రాయిని అందుకోవడం కష్టమే. పైగా వంద సినిమాల హీరో అనిపించుకోవాలన్న ధ్యాస వెంకీకీ ఏమాత్రం లేదు. అందుకే 75వ సినిమానే వెంకీకి వెరీ వెరీ స్పెషల్ అవుతుంది.
దాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించాలని సురేష్బాబు నిర్ణయం తీసుకొన్నారు. వెంకీ ఇప్పటి వరకూ టచ్ చేయని జోనర్లో ఈ సినిమా ఉండాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ బాధ్యతని క్రిష్ చేతిలో పెట్టారాయన. ప్రస్తుతం క్రిష్ బాలయ్య 100 సినిమా పనిలో ఉన్నారు. ఆ తరవాత బాలీవుడ్లో ఓ సినిమా చేయాల్సివుంది. ఈలోగా కిషోర్ తిరుమల షూటింగ్ కూడా పూర్తవుతుంది. ఆ వెంటనే 75వ సినిమా పట్టాలెక్కించేయొచ్చు. ఇదేదో సోఫియో ఫాంటసీ సినిమా అన్నట్టు బయట ప్రచారం జరుగుతోంది. అయితే… అదేం కాదట. థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతోందన్నది తాజా సమాచారం. ఇప్పటికే క్రిష్ మైండ్లో ఓ లైన్ ఉందని, దాన్ని వెంకీకి వినిపించడం ఆయన పచ్చజెండా ఊపేయడం జరిగిపోయాయని వెంకీ 75వ సినిమాకి క్రిష్ దర్శకుడని అనధికార వర్గాల సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయి.