జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి విశ్వసనీయంగా అందిన సమాచారమేనని భావిస్తున్నారు. తనకు అందిన సమాచారంతో పాటు ఫిర్యాదును నేరుగా సీపీకి జేడీ లక్ష్మినారాయణ ఇచ్చారు. ఆయన పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

సీఎం జగన్ అక్రమాస్తుల కేసులతో పాటు మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి కేసుల్ని సీబీఐ జేడీగా ఉన్నప్పుడు వీవీ లక్ష్మినారాయణ డీల్ చేశారు. వీరిద్దర్నీ అరెస్టు చేశారు. పకడ్బందీగా దర్యాప్తు చేసి.. చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. వీటిపై నిందితులు రకరకాల పిటిషన్లు వేసి ట్రయల్ ఆలస్యం చేసుకుంటున్నారు. అదే సమయంలో బెయిల్ కోసం ఏకంగా జడ్జికే లంచం ఇస్తూ.. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు దొరికిపోయారు. వారిని కూడా జైల్లో పెట్టారు.

తర్వాత సీబీఐ జాయింట్ డైరక్టర్ గా రిలీవ్ అయి మహారాష్ట్ర క్యాడర్ కు వెళ్లిపోయారు. అక్కడ ఉన్నతాధిరిగా కీలక పదవిలో ఉన్నప్పటికీ ముందస్తు రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి సొంత పార్టీ తరపున విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో సీబీఐలో ఉన్నప్పుడు దర్యాప్తు చేసిన కేసుల్లోని నిందితులు తనపై దాడికి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం ఆయనకు అందినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close