వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత అటూ ఇటూ ఊగిసలాడి చివరికి టీడీపీలో చేరారు. దళిత మేధావి కావడంతో చంద్రబాబు కూడా ఆయనకు ముందు ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ సీటిచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన అసలు రాజకీయం చేశారు.

జగన్ మూడు రాజధానుల రాజకీయం చేస్తున్నప్పుడు.. శాసనమండలిలో టీడీపీకి మద్దతుగా ఉండకుండా..రాజీనామా చేశారు. ఇందు కోసం ఆయన చెప్పిన కారణం.. అమరావతికి అన్యాయం జరుగుతోందని. జగన్ అమరావతికి అన్యాయం చేస్తున్నాడని రాజీనామా చేసి.. మళ్లీ వైసీపీలో చేరి టీడీపీపై విమర్శలు చేశారు. తాను రాజీనామా చేస్తే ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటును జగన్ ఇస్తే తీసుకుని అదే పదవిలో కొనసాగారు.అంటే అది సాంకేతికంగా టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవినే.

తర్వాత జగన్ ఆయనతో ఓ ఆట ఆడుకున్నారు. తాడికొండకుకు ఇంచార్జ్ గా పెట్టి చెప్పకుండా తీసేశారు. కనీసం అపాయింట్ మెంట్ లేదు. బహిరంగంగా బతిమాలుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆయన అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా పట్టించుకోవడం లేదు. ఈ అవమానాలు భరించలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. నామినేషన్లకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆలస్యం చేశారు. మరి ఇప్పుడు ఎక్కడ చేరుతారో ఇంకా స్పష్టత రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close