ఇంకా ఉంది… సభా సమరం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయి. శీతాకాల సమావేశాలను జనవరి 11 వరకు నిర్వహించాలని బి ఎ సి సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత ఉభయ సభలూ జనవరి 3కు వాయిదా పడ్డాయి.

అర్థవంతమైన చర్చ జరిగితే ఎన్ని రోజులైనా సభ నిర్వహించదానికి అభ్యంతరం లేదని సిఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అందుకు అనుగుణంగా సమావశాలను పొడిగించారు. అయితే నిష్పక్ష పాతంగా జరిగితేనే సభకు వస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే ప్రభుత్వ, స్పీకర్ వైఖరికి నిరసనగా సభను బహిష్కరించారు.

ప్రస్తుత సమావేశాల్లో చాలా వరకు చర్చ తప్ప రచ్చ పెద్దగా కనిపించలేదు. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పెద్దనోట్ల రద్దును కేసీఆర్ సమర్థించిన తీరుకు అంతా విస్తుపోయారు. నల్లధనంపై జరుగుతున్న యుద్ధానికి అందరూ మద్దతు ఇవ్వాలంటూ విపక్షాలకు సూచించారు.

ఇప్పుడు కొత్త ఏడాది లో మరో ఏడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. ఏడు రోజుల్లొ ఏడు అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ వైఖరి పై తెరాస నేతలు గుర్రుగా ఉన్నారు. సంఖ్యా బలం తక్కువగా ఉన్నా వారికి ఎక్కువ అవకాశం ఇచ్చామని గుర్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో భూసేకరణ అంశం దుమారం రేపింది. ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు దండెత్తాయి. అయితే తెరాస కూడా అంతే దీటుగా విమర్శలను తిప్పికొట్టింది. ఈ సందర్భంగా సిఎం సుదీర్ఘ ప్రసంగం ఆకట్టుకుంది.

ఇంకా అనేక అంశాల పైనా వాడి వేడి చర్చ జరిగింది. రెండో దశ సమావేశాలు కూడా అదే తరహాలో జరగవచ్చు. వీలైనంత వరకు ప్రతిపక్షాల వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వాలని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నామనే అపఖ్యాతి రాకుండా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close