వంశీ పైడిప‌ల్లి ఇప్పుడేం చేస్తాడు?

ఊపిరి సినిమాకు రూ.21 కోట్లు న‌ష్టం వ‌చ్చింది.. దానికి స‌మాధానం చెప్పాలి అంటూ వంశీపైడిప‌ల్లిని లాక్ చేశాడు పీవీపీ ప్ర‌సాద్‌. అంతేనా…??? మ‌హేష్‌తో వంశీ చేయ‌బోయే క‌థ‌పై నాకూ హ‌క్కులున్నాయి అంటూ ఆ సినిమా మొద‌ల‌వ్వ‌కుండా స్టే ఆర్డ‌రు తెచ్చుకొన్నాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ వంశీ ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. త‌న వాద‌న వినిపించుకోలేదు. టాలీవుడ్‌లో ఓ ద‌ర్శ‌కుడికి ఇలాంటి ప‌రిస్థితి ఎదురుకావ‌డం ఇదే తొలిసారి. అందుకే వంశీపైడిప‌ల్లి ఆచి తూచి స్పందించాల‌ని నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది.

వంశీ ముందున్న మార్గాలు రెండే. ఒక‌టి…. పీవీపీతో రాజీ కుదుర్చుకోవ‌డం. రెండోది మ‌హేష్‌తో చేయ‌బోయే సినిమాలో పీవీపీని పార్ట‌న‌ర్‌గా చేర్చుకోవ‌డం. రెండోది ఎలాగూ కుదిరే ప‌నికాదు. అందుకే రాజీ కుదుర్చుకోవ‌డం మిన‌హా మ‌రో మార్గం క‌నిపించ‌డం లేదు. అందుకే ఈ వివాదాన్ని దాస‌రి నారాయ‌ణ‌రావు ముందు పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది. ఊపిరి సినిమా చూసి దాస‌రి ఎగ్జ‌యిట్ అయ్యారు. వంశీని పిలిపించి మాట్లాడారు. అభినందించారు. దాస‌రి ఎప్పుడూ ద‌ర్శ‌కుల ప‌క్ష‌మే. ఆయ‌నే త‌న‌కో దారి చూపిస్తార‌ని న‌మ్ముతున్నాడు వంశీ. పెద్ద‌ల‌తో కూర్చుని మాట్లాడితేగానీ.. ఈ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌దు అంటూ దిల్‌రాజు లాంటి వాళ్లు కూడా వంశీకి స‌ల‌హాలు ఇస్తున్నారు. అందుకే ఈ విష‌య‌మై వంశీ ఇప్ప‌టి వ‌ర‌కూ మీడియాతో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. తాను ఏం మాట్లాడినా ఇష్యూ ఇంకా పెద్ద‌దైపోతుంద‌ని త‌న‌కు తెలుసు. దాస‌రి ముందో, ఇండ్ర‌స్ట్రీ పెద్ద‌ల ముందో, లేదంటే ద‌ర్శ‌కుల సంఘం ముందో త‌న వాద‌న వినిపించి.. వాళ్ల అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు త‌దుప‌రి స్టెప్ వేయాల‌నుకొంటున్నాడ‌ట‌. పీవీపీ తాజా ఎత్తుగ‌డ‌తో మ‌హేష్ – వంశీ పైడిప‌ల్లి సినిమా ఇబ్బందుల్లో ప‌డింది. వీట‌న్నింటికీ వంశీ ఎలా దాటుకొని వ‌స్తాడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close