మోడీ చెప్పిన సత్యాలు

కొత్త యేడాది ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం అందరినీ ఆలొచింప చేసింది. దేశంలో 24 లక్షల మంది మాత్రమే తమ వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలకు పైబడి ఉందని ప్రకటించారు. ఇది నిజమేనని నమ్ముదామా అని మోడీ ప్రశ్నించారు.

కచ్చితంగా ఇది నమ్మదగిన విషయం కాదు. అందుకే, దెశంలొ నీతి నిజాయితీ పెరగాలి. అవినీతి, తప్పుడు లెక్కల రోజులు పోవాలి అని పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల సానుకూల ఫలితాలు వచ్చాయని చెప్పారు.

విపక్షాల ఆరోపణల్లొ నిజం లేదని ఆయన అంకెలతో నిరూపించారు. ఈ యేడాది రబీ సాగు 6 శాతం పెరిగిందని చెప్పారు. ఎరువుల కొనుగోళ్ళు 9 శాతం పెరిగాయన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యవసాయం దివాలా తీసిందని రాహుల్ గాంధీ తదితరులు చేసిన ఆరోపణలకు దీటిగా జవాబు చెపారు.

మోడీ అడిగిన మరో ప్రశ్న కూడా ఇలాంటిదే. దెశంలో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. మానవ వనరులు ఉన్నాయి. 65 శాతం యువ జనాభా ఉంది. అవకాశాలు ఉన్నాయి. తగిన సాధనాలు ఉన్నాయి. అయినా ఈ దేశం వెనకబడి ఉండటానికి కారణం ఉందా అని ప్రశ్నించారు. లేదు. ఇంతటి వనరులు ఉన్న దేశం ముందుకు వెళ్లకుండా అడ్డు పడుతున్నదు అవినీతి, నల్లధనం. వాటిపై యుద్ధంలో మద్దతు తెలిపిన ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.

పేదలకు, మధ్య తరగతి వారికి సొంత ఇంటి కోసం కొన్ని రాయితీలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రైతులకూ మేలు చేసే నిర్ణయాలు వెల్లడించారు. గర్భిణీలకు, సీనియర్ సిటిజెన్లకు కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారు.

అనివీతి, నల్లధనం పై యుద్ధం ఆగదని స్పష్తంగా ప్రకటించారు. డబ్బు కోసం ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని హామీ ఇచ్చారు. మొత్తానికి కొత్త యేడాది ప్రారంబానికి ముందు మోడీ చేసిన ప్రసంగం నవశకానికి నాంది పలకాలనే ఆశయాన్ని చాటింది. సాహసంతో తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఫలితాన్ని ఇచ్చే వరకు ఆయన పోరాటం ఆగదని స్పష్తమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close