వైకాపా కాదు సైకో పార్టీ: అచ్చెం నాయుడు

కేవలం ఐదు రోజులు మాత్రమే సాగబోయే ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో మూడు రోజుల పుణ్యకాలం పూర్తయిపోయింది. ఈ మూడు రోజుల్లో ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చలు జరుగాకపోయినా ఆ పేరుతో అధికార, ప్రతిపక్షాలు ప్రజలకు మంచి వినోదం పంచుతున్నాయి. కాకపోతే ఆ తప్పనిసరి వినోదం ఖరీదు చాలా ఎక్కువ. అయినా ప్రజలు దానిని భరించాలి తప్పదు. నిన్న అసెంబ్లీలో శ్రీమంతుడు సినిమా, జబర్దస్త్ కామెడీ షో గురించి శాసనసభలో రసవత్తరమయిన చర్చ జరిగింది. ఈరోజు సభలో కార్మిక శాఖమంత్రి అచ్చెం నాయుడు వైకాపాకి సైకోపార్టీ అని పేరు పెట్టుకోమని సూచించడంతో వైకాపా సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియంని చుట్టుముట్టి నినాదాలు చేయడం మొదలుపెట్టడంతో స్పీకర్ సభని వాయిదా వేశారు.

అనంతరం మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ఈనెల 9 నుండి రాష్ట్రంలో రైతన్నల కోసం ప్రభుత్వం చంద్రన్నయాత్రలు నిర్వహించబోతోందని, ఆ సందర్భంగా ఇంతవరకు ఎంతమంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందీ వివరాలను తెలియజేస్తామని అన్నారు. దానిపై వైకాప ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ, చంద్రన్న యాత్రలు అనేకంటే చంద్రన్న కరువు యాత్రలు అని పేరు పెట్టుకొంటే ఇంకా బాగుంటుందని ఎద్దేవా చేసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఒక్క రుణం కూడా పూర్తిగా మాఫీ చేయలేకపోయినా, చాలా చేసేసినట్లు ఇంకా ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం, దాని కోసం యాత్రలు కూడా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అధిక ధరలతో ఒకపక్క రాష్ట్రంలో ప్రజలు విలవిలాడుతుంటే, ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేప్పట్టకుండా, ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న తమనే తప్పు పడుతోందని రోజా విమర్శించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close