బాహుబ‌లికి ప్ర‌భుత్వం వారి హెచ్చ‌రిక‌

బాహుబ‌లి ఇప్పుడు `బ్లాక్‌` బ‌లి అయ్యింది. స్పెష‌ల్ షోల పేరుతో డ‌బ్బులు దండుకొంటున్నారు. టికెట్ ధ‌ర రూ.2 వేల నుంచి రూ.3 వేల వ‌ర‌కూ ఉంది. సింగిల్ స్క్రీన్‌ల‌లోనూ ఒక్కో టికెట్ నీ రూ.200ల‌కు అమ్మాల‌ని థియేట‌ర్ యాజ‌మాన్యాలు నిర్ణ‌యించుకొన్నాయి. ఈ విష‌యాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌పీ మంత్రి విష‌యాన్ని సీరియ‌స్ గా తీసు కుని థియేట‌ర్ యాజ‌మాన్యాన్ని, బాహుబ‌లి టీమ్ ను హెచ్చరించారు.

`తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. బాహుబ‌లి చూసిన త‌ర్వాత చరిత్ర ఊహించ‌ని విధంగా ఓ క్రేజ్ వ‌చ్చింది. క‌మ‌ర్శియ‌ల్ గాను సినిమా పెద్ద స‌క్సెస్ అయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎలక్ష‌న్ టైమ్ లో…అసెంబ్లీలో కూడా క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌న్న దానిపై చ‌ర్చ సాగింది. హిస్టారిక‌ల్ సినిమా కావ‌డంతో బాహుబ‌లికి 5 షోలు అడిగారు. మేము కూడా అంగీక‌రించాం. బాహుబ‌లి లాంటి సినిమాకు ప్ర‌మోష‌న్ అవ‌స‌రం లేదు కానీ, ఇష్టాను సారంగా టిక్కెట్ ధ‌ర‌లు ఉన్నాయ‌ని టీవీల్లో వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే థియేట‌ర్ లో స్నాక్స్ ను ప్యాకేజ్ అంటూ 200, 300 దండేట‌ట్లు ప్లాన్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఈ విష‌యంపై ప్రభుత్వం సీరియ‌స్ గా ఉంది. దీనిపై ఓ స‌మావేశం కూడా ఏర్పాటు చేశాం. గ‌వ‌ర్న‌మెంట్ ఫిక్స్ చేసిన రేట్ల‌కు టిక్కెట్లు అమ్మాలి లేక‌పోతే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం. బాహుబ‌లి టీమ్ ప్ర‌మేయం లేకుండా థియేట‌ర్ల యాజ‌మాన్యం ఇష్టాను సారంగా వ్వ‌వ‌హ‌రిస్తున్నారు. దానికి మాత్రం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. బెనిఫిట్ షోలు ఎక్క‌డా ఇవ్వ‌లేదు. బాహుబ‌లి సినిమా కోసం అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌ధ్య త‌గ‌ర‌తి కుటుంబాల‌కు టిక్కెట్ అందుబాటులో లేక‌పోతే మీరంతా చాలా స‌మ‌స్య‌లు ఫేస్ చేయాల్సి ఉంటుంద‌ని` హెచ్చ‌రించారు. సో.. బాహుబ‌లి 2 టికెట్ రేట్లు దిగిరాక త‌ప్ప‌వేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close